కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్9: కరోనావల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపో యిన చిన్నారులకు రెడ్క్రాస్ అనాథా శ్రమంలో ఆశ్రయం కల్పిస్తామని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. అలాంటివారు ఎవరైనా ఉంటే సెల్ నెంబర్లు 9666900900, 90590 45257 ఫోన్చేసి వివరాలు అందించవచ్చని చెప్పారు. 7 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సున్న అబ్బాయిలు, అమ్మాయిలు అనాథలుగా మిగిలిపోయినట్లయితే వారి వివరాలను తెలియజేస్తే అలాంటి పిల్లలను మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని ఏనుగొండలో ఉన్న రెడ్క్రాస్ అనాథశ్రమంలో ఆశ్రయం కల్పిస్తామని చెప్పారు. ఈ విషయమై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులకు లేఖలు రాయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఎగ్జిక్యూటివ్ బాడీ కమిటీ ఈ మేరకు తీర్మానం చేసింది. ఎన్ఆర్ఐ వైద్యులు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపగా వాటిలో 2 జిల్లాకు కేటాయించగా వాటిని కలెక్టర్ రెడ్క్రాస్కు అప్పగించారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ నటరాజ్, ఉపాధ్యక్షుడు డాక్టర్ శామ్యూల్, ట్రెజరర్ జగపతిరావు, సభ్యులు రమణయ్య, వీరేశం పాల్గొన్నారు.