భూత్పూర్, మే 9: పేదల పాలిట కల్యాణలక్ష్మి వరం లాంటిదని ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో ఎమ్మెల్యే నివాసంలో మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ఇప్పలపల్లి, గాజులపేట గ్రామాలకు చెందిన 6మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ పెద్ద దిక్కులా, మేనమామల పెళ్లికి రూ. 1,00,116లను కానుకగా అందిస్తున్నారని తెలిపారు. కులమతాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి ఈ పథకం అమలవుతుందని తెలిపారు. కార్యక్రమంలో తాసిల్దార్ కిషన్, సర్పంచులు శేఖర్, వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకుడు రాజు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థికసాయం
మూసాపేట(అడ్డాకుల), మే 9: మండలంలోని రాచాల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు సుదర్శన్ కొద్ది రోజుల కిందట కరోనా వ్యాధికి గురై మృతిచెందారు. ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి రాచాల గ్రామంలోని బాధితుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ. 20వేల ఆర్థిక సాయం చేశారు.