గద్వాల: జిల్లాలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలనే ఆలోచనతో ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ఏర్పాటు చేసి దాని ద్వారా వేగవంతంగా అనుమతులు మంజూరు చేస్తున్నదని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలె క్టర్ సమావేశపు మందిరంలో టీఎస్ ఐ-పాస్, డీఐపీసీ సమావేశం జిల్లా అధికారుతో కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా జిల్లాలో పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నఅనుమతుల వివరాలు కలెక్టర్ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యాదగిరిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు చేయూతనివ్వాలనే ఆలోచన, పారి శ్రామిక వేత్తలను ప్రోత్సహించా లనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ఏర్పాటు చేసిందని దీని ద్వారా పరిశ్రమల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకునే వారికి వారి అర్హతను బట్టి అనుమతులు వేగవంతంగా మంజూరు చేయాలని ఆదేశించారు. అనుమతులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.
జిల్లాలో ఇప్పటి వరకు 215 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. దీనిని మంరిత పెంచాలని అధికారులకు సూచించారు. టీప్రీడ్జీ స్కీం ద్వారా 20మంది ఎస్సీ ప్రారిశ్రామిక వేత్తలకు రూ.49.90లక్షలు, నలుగురు ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ.12.90 లక్షలు ట్రాక్టర్స్, ఆటోలకు సబ్సిడీ మంజూరు చేశామని తెలిపారు.
ఈ స్కీం కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు (పురుషులు)35 శాతం, ఆడ వాళ్లకు 45 శాతం, పీహెచ్సీ పురుషులకు 35శాతం, ఆడవాళ్లకు 45శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అధికారులు పురుషోత్తంరెడ్డి, తిరుపతిరావు, భాస్కర్రెడ్డి, రమేశ్బాబు, శ్రీనివాసులు, సుధాకర్, పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.