కొంతమందికి ఎన్ని మంచిమాటలు చెప్పినా తమ తీరు మార్చుకోరు. తాము చెప్పిందే వేదం అనే నమ్మకంతో బతికేస్తుంటారు. సూక్ష్మంగా సులభంగా చెప్పాలంటే కుక్క తోక వంకరే అని, ఎన్ని ఎదురుదాడులు, విమర్శలు వచ్చినా, ఎంత మంది తన రాతలు చూసి నవ్వుకున్నా మన అంధజ్యోతి రాధాకృష్ణ తన వెనుకటి గుణం మానడు. కాలపరిమితి ముగిసిన తన కాశీమజిలీ కథా రచనలు ఆపడు.
వాస్తవాల వక్రీకరణ ప్రావీణ్యంతో కోడిగుడ్డు మీద ఈకలు పీకటానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. పోయిన వారం తన కొత్తపలుకులో సీఎం కేసీఆర్పై ధ్వజమెత్తిండు. అడ్డదిడ్డంగా నోరుపారేసుకుని అభాసుపాలైండు. ఈ వారం జగన్ పై తన బాణాలు ఎక్కుపెట్టిండు. జగన్ను ఆయన రాజకీయ ఎత్తుగడలను ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా ప్రశంసిస్తూనే మోదీకి జగన్పై అనుమానం వచ్చేలా విషబీజాలు నాటడానికి శక్తిమేరా ప్రయత్నించిండు. దానికి ఆయనకు దొరికిన ఇంధనం షర్మిల తాజా రాజకీయ ప్రహసనం. నిజమే షర్మిల తన తెలంగాణ పార్టీని కాంగ్రెసులో కలపటానికి రాహుల్, సోనియాతో చర్చించి విలీనానికి దాదాపు అంగీకరించి ఇప్పుడు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిన మాట వాస్తవమే. కాంగ్రెసు అధిష్ఠానం నుంచి ఆమెకు ఆశించిన ప్రోత్సాహం లభించకపోయినా నిస్సహాయంగా వారి ప్రతిపాదనలకు అంగీకరించటం నిజంగా దయనీయమైన స్థితే.
అసలు తెలంగాణలో షర్మిల ఎందుకు పార్టీ పెట్టిందో ఆమెకైనా తెలుసా? తన అన్నతో ఆమె కు ఎందుకు ఏ విషయంలో విభేదాలు వచ్చా యో ఇంతవరకు తెలియదు. పచ్చమాద్యమా లు ముఖ్యంగా రాధాకృష్ణ మనో వాల్మీకం నుం చి వచ్చిన బుస భుజంగాలే అన్నీ. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతుందనే విషయం రాసిం ది కూడా రాధాకృష్ణనే. షర్మిల ఆమె అనుచరు లు తన అన్న మీడియాకు లీకులు ఇవ్వలేక రాధాకృష్ణకు ఇచ్చినందునే ఆయన తెలిపిండు. అదేదో తన పరిశోధనాత్మక జర్నలిజంగా కొన్నా ళ్ళు ఆయన డబ్బా కొట్టుకున్నడు. దీని ద్వారా జగన్ అప్రతిష్ఠపాలైతే ఆంధ్రలో తమ టీడీపీకి ఉపయోగపడుతదని ఆశించిందీ ఆర్కేనే.
అసలు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టాలనుకోవడంలో వీసమంతైనా విజ్ఞత ఉందా? ఆమె ఎవరికీ తెలియకుండ తెలంగాణ కోడలు ఎప్పుడైంది? అన్నతో విభేదాలు ఉంటే అక్కడే తేల్చుకోవాలి కానీ ఇక్కడ కొచ్చి ఏం చేస్తది. తొమ్మిదేండ్ల చంద్రబాబు దుష్టపాలన తర్వాత రాజశేఖర్రెడ్డి పాలన మీద అభిమా నం తెలంగాణ ప్రజ ల్లో కొంత ఉండచ్చు. కానీ అది రాజన్న రాజ్యం కావాలన్నంత కాదు.
సరే..ఇప్పుడు ఢిల్లీల షర్మిలకు లభించిన హామీలేంటి? ఆర్కే చెప్పే దాని ప్రకారం ఆమె ను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతరు, కేంద్రకమిటీలో స్థానం కల్పించి దక్షిణభారతంలో ప్రచారం చేయిస్తరు. ఇది షర్మిల కంటే రాధాకృష్ణకు ఎక్కువ నిరాశ కల్పించింది.ఎందుకంటే తెలంగాణల ప్రచారం చేయించి పార్టీ బాధ్యతలప్పగిస్తే తమ అనుంగు శిష్యుడు ఆంధ్రావాది రేవంత్కు రాజకీయ నష్టం చేస్తది. ఒకవేళ సయోధ్య కలిపించి తెలంగాణల తిప్పితే కాంగ్రెసుకు లాభం కావొచ్చునని అనుకున్నడు ఆర్కే. అదే ఆంధ్ర కాంగ్రెస్ పగ్గా లు అప్పగిస్తే ఆమె తన అన్న పైనే వాగ్దాడి చేసి వైఎస్సార్సీపీ ఓటుబ్యాంకును కొంతై నా కొల్లగొడితే అది తమ చంద్రబాబుకు లాభమని ఆశ పడ్డడు ఆర్కే. ఇప్పుడు షర్మిల ఉభయ భ్రత్వం చెంద టం వల్ల ఆర్కే ఖంగుతిన్నడు. ఈ ఊహాగానాలన్నీ రాధాకృష్ణుడి మానస పుత్రికలే..ఎందుకంటే ఇటువం టి ఊహాతీత ఊహలు రాధాకృష్ణ మనసుకు తప్ప ఇతర పాత్రికేయులకు తట్టవు. విషయం ఏదైనా, సంఘటన ఏదైనా, పరిణామం ఏదైనా దాంట్లోంచి ఒక ఈక గుంజి జగన్కో, కేసీఆర్కో అంటగట్టి బురద జల్లటం రాధాకృష్ణ మానస వికృత క్రీడ.. చిన్నప్పటి మన ఆవుకథ లెక్క.. అందుకే ఒక విఠలాచార్య జానపద కథను అల్లిండు.
షర్మిల తన పార్టీని కాంగ్రెసుల కలిపితే ఆమె ఆంధ్రల పార్టీ ప్రచారం చేస్తే తనకు తీవ్ర నష్టం కలుగుతుందని భయపడి జగన్ కాంగ్రెసు పెద్దలకు డీకే శివకుమార్తో సహా డబ్బు పంపి ఎలక్షన్లు అయినంక తన ఎంపీలతో కాంగ్రెసుకే మద్దతు చేపిస్తానని కాంగ్రెసు పెద్దలతో దౌత్యం నెరిపి సంధి చేసుకున్నడట.అట్లా రెండు కేంద్ర పార్టీలతోప్రేమ నటిస్తూ కాంగ్రెసుకు వలపు బాణాలు విసురుతుండంట జగన్.ఆహా ఆర్కే.
ఈ ‘హన్న జగనా’ అన్నందుకే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ‘పోసాని మురళి’ తన సహజ వాగ్ధోరణితో చెణుకులు విసిరి నిన్ను నగ్నంగా నిల బెట్టిండు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈప్రయోగం చే శావు. ఇగ ఇప్పుడు మో దీ జగన్పై ఎట్ల రియాక్ట్ అయితడో అని బాధాకృష్ణ కొంత ఆశాభావం తో ఉన్నడు.
రాధాకృష్ణ, షర్మిల కాదు ఇంకెవరు వచ్చి ఎన్ని అనర్గళ ఉపన్యాసాలు ఇచ్చినా అక్కడ జగన్ను గానీ, ఇక్కడ కేసీఆర్ను గానీ ఎదుర్కోగలరా?
జగన్పై మీ పచ్చ మీడియా కరుడుకట్టిన కార్యకర్తలకు తప్ప బీజేపీలో పెద్దగా వ్యతిరేకత లేదు. మోదీకి, బీజేపీకి ఇంకా బాగా తెలుసు.. మోదీని వ్యక్తిగతంగా తిట్టవద్దని మీలాంటి శ్రే యోభిలాషులు చెప్పినా ఆయన వినలేదా? ఎందుకీ జోకులు ఆర్కే.
మోదీని తిట్టించిందే మీ మీడియా? మీ పచ్చ విశ్లేషకుడు దివంగత నరసింహారావు చౌదరితో మోదీ మానసిక స్థితిపై పుస్తకాన్ని రాయించి దాన్ని మీ ఛానల్ లో చర్చలు పెట్టి ధారావాహికంగా కార్యక్రమాలు నిర్వహించింది మీరేకదా ఆర్కే. జగన్ 14 లోనూ 19 లోనూ ఒకటే చెప్పిండు. తనకు రాష్ట్ర ప్రయోజనాలు ము ఖ్యమని, రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతు ఇస్తానని. దాన్ని బహుశ త మ రు వక్రీకరణకు వాడుకున్నట్టున్నది ఆర్కే.
జమిలి ఎన్నికలు డిసెంబరు, జనవరిలోనో జరిగితే మోదీ గెలవకపోవచ్చునని జగన్ భావించి కాంగ్రెసుకు దగ్గరవుతున్నాడంటున్నవు. ఎవరు గెలిచినా ఓడినా రాష్ట్రంలో ఉన్న అధినాయకులకు ఏం ఫరక్ అయితది. ఒక ముద్దాయిని నేరస్తుడిగా పదే పదే మీరు మీ ఛానల్లలో విద్యావంతులైన చెల్లింపు దారులు అనటం ఏం సంస్కారం రాధాకృష్ణా? ఇప్పు డు తమ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నందున మోదీ తొందరగా అంగీకరించాలనే జగన్పై ఈ ఆధారాలు లేని అభాండాలు వేస్తున్నారని అర్థమైంది ఆర్కే.
షర్మిల వివేక శూన్య నిర్ణయాలకు ఆమే బా ధ్యురాలు. సంస్కృతంలో భర్తృహరి చెప్పిన శ్లోకాన్ని తెలుగులో పరవస్తు చిన్నయ సూరి ఇలా చెప్పిండ్రు.. ‘బోరి దైవోపహతుండు పోవు కడకే పోవు కదా ఆపదల్’ అని.. నీకూ అవితప్పవు ఆర్కే.
ఆర్కే మరికొన్ని ముత్యాల పలుకులు పలికిండు. జగన్కు కాంగ్రెసుతో పొత్తని తెలిస్తే సెటిలర్లు కాంగ్రెసుకు ఓటెయ్యరట. అప్పుడు బీఆర్ఎస్కు లాభం కాంగ్రెసుకు నష్టం జరుగుతుందం ట. రాధాకృష్ణా..అసలు సెటిలర్లందరూ ఒకే పార్టీకి ఓటువేసే ఓటు బ్యాంకులని ఎందుకనుకుంటున్నవో నీకే తెలియాలి..వారిలో కూడా భిన్నాభిప్రాయాలు కలవారు వివిధ పార్టీలకు చెందిన ఓటర్లు ఉంటరు.. కమ్మ ఓటర్లలో ఎక్కు వ మంది మాత్రమే ఒక పార్టీకి వేస్తరు. వారుకూడా ఇక్కడ తమ కాలనీల అభివృద్ది కోసం, ప్రభుత్వ సహకారం కో సం. బతుక నేర్చిన వలసాంధ్రులంతా గత రెం డు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్కే వేశారు. ఏ తుమ్మల కోసమో ఆయన చెప్పిన పార్టీకి వేయరు.
2018 ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి సుహాసిని పోటీకి దిగినప్పుడు కాట్రగడ్డ ప్రసూన ఒక టీవీతో మాట్లాడుతూ ‘కూకట్పల్లిలో మా కమ్మ లు ఎక్కువ ఉన్నరు కాబట్టి సుహాసిని గెలుపు సునాయాసం అన్నది. కానీ అక్కడి కమ్మల సంగతేమో కానీ అక్కడ సీమ ఓటర్లు, కాపు ఓటర్లు, స్థానిక తెలంగాణ అభ్యర్థికే ఓటువేసి సుహాసినిని ఘోరంగా ఓడించారు. సెటిలర్లందరూ మీ పార్టీకే వేస్తరని మీ బాబే సీమ ఓటర్ల సొంతదారు అని భ్రమలో జీవించకు ఆర్కే…
ఇక జగన్ కాంగ్రెసు ఒప్పందం తెలిసి తు మ్మల తన మనసు మార్చుకోవచ్చని కాంగ్రెస్ లో చేరడని రాశావు. చూద్దాం.నీ రాత నిజమైతదో లేదో? అట్ల అయితే తుమ్మల భవిష్యత్తుకే మంచిది కదా? మొత్తం మీద జగన్ మీద మోదీ కి అనుమాన మేఘాలు ఏర్పడుతాయనే నీ దురాశపర ఆశతో నీకు నీవే సెల్ఫ్ గోల్ వేసుకున్నవు రాధాకృష్ణా!! నీవు జగన్ కో, కేసీఆర్కో ఏదో జరగాలని రాసిన ప్రతిసారీ నీకు ఎదురు దెబ్బలే తగులుతున్నయి ఆర్కే.
కొంచెం నీ రాతలలో నిర్మాణాత్మక విమర్శ ఉండేటట్టు చూసుకో.. ఎప్పుడూ ఎదుటివారిని తక్కువగా అంచనావేసి వారి ని చిన్నగా చూపి బురదజల్లాలనుకుంటే నువ్వు ఇట్లనే నవ్వుల పాలయితవు ఆర్కే.
ప్రజలు నేడు అత్యంత చైతన్యవంతులు. రాజకీయ పరిణతి చెందినవారు. నీ బురద రాతలను నమ్మరు. ఇప్పుడు నీ కొత్తపలుకుకు గిరాకీ లేదు రాధాకృష్ణా తెలుసుకో…చెరపకురా చెడేవు..