కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్లకు లాభం చేకూరుస్తూ ఉన్నది. దీనిపై ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉంది. దేశాన్ని అభివృద్ధి బాట పట్టించే నాయకుడి కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అపార వనరులున్నప్పటికీ దేశం ఇంకా ఎందుకు అభివృద్ధి సాధించలేదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించారు. తెలంగాణ మాడల్ అభివృద్ధిని దేశానికి అందిస్తానని హామీ ఇచ్చారు. ఆయన సామర్థ్యాన్ని గుర్తించిన దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో దేశ్ కీ నేత కేసీఆర్ అనే మాట దేశమంతటా ఎక్కువగా వినిపిస్తున్నది.
గత మూడు నాలుగు నెలలుగా దేశంలో తెలంగాణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు యావత్ దేశాన్ని ఆలోచింపజేస్తున్నాయి. సీఎం కేసీఆర్ దార్శనిక పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా దూసుకుపోతున్నది. దీనికి భిన్నంగా మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కేంద్రం కార్పొరేట్ల కొమ్ముకాస్తూ సాధారణ జనాన్ని విస్మరించింది. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డికి పావు సేరు చొప్పున గౌతమ్ అదానీకి కట్ట బెడుతున్నారు. దీంతో అతి తక్కువ కాలంలోనే ప్రధాని సన్నిహితుడైన అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్ర స్థానంలోకి చేరారు.
మరోవైపు కేంద్రం తనను ప్రశ్నించే పార్టీల నాయకులను వేధించేందుకు కేంద్ర ఈడీ, ఐటీ, సీబీలను ఉసి గొల్పుతున్నది. కానీ ప్రతి సందర్భంలో అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఒక నాయకుడు వస్తారని చరిత్ర చెబుతున్నది. ఇప్పుడు సీఎం కేసీఆర్ అలా ముందుకు వచ్చి మోదీకి, బీజేపీకి పెద్ద సవాల్ విసిరారు. కేంద్రం నుంచి సహకారం లేకున్నా, కొత్తగా ఏర్పడిన రాష్ర్టాన్ని తన దార్శనికతతో అభివృద్ధి చేశారు. తెలంగాణను సిరుల మాగాణిగా తీర్చిదిద్దారు.
ఈ నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ర్టాల ప్రజలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రుచించడం లేదు. తెలంగాణ నాయకత్వాన్ని ఇలానే వదిలేస్తే రేపటి రోజున తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళన బీజేపీలో మొదలైంది. అందుకే కొన్ని నెలలుగా సీఎం కేసీఆర్ పైనా, తెలంగాణ పైనా కక్ష పెంచుకుని రాజకీయ కుట్రలకు తెర లేపింది. ఎమ్మెల్యేలను కొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనుకున్నది. కానీ సీఎం కేసీఆర్ రాజకీయ చాణక్యం ముందు బీజేపీ దుష్ట పన్నాగం పారలేదు. పైగా కుట్రదారులు పోలీసులకు చిక్కడంతో బీజేపీ దుర్బుద్ధిని దేశం మొత్తం కళ్లారా చూసింది.
అప్పటి నుంచే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై దేశ ప్రజల్లో నమ్మకం మొదలైంది. బీజేపీని ఎదుర్కోవడానికి ఇన్నాళ్లకు ఒక సరైన నాయకుడు దొరికారని యావత్ దేశం చర్చించుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీని ఎదుర్కోవడం తమ వల్ల కాదు అనుకున్న పార్టీలను సైతం కేసీఆర్ ఆలోచనలో పడేశారు. మోదీని ఎదిరించిన తీరుని చూసి కేసీఆర్తో చేతులు కలుపుతున్నాయి. ఆయనను జాతీయ స్థాయి నాయకుడిగా భావిస్తున్నాయి. ఇదే సమయంలో బీజేపీని గద్దె దించడానికి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు కేసీఆర్. కేసీఆర్ సామర్థ్యాన్ని గుర్తించి వివిధ రాష్ర్టాల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ రెండు ప్రధాన లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. బీజేపీ నిరంకుశ పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించడం ఒకటైతే, తెలంగాణ మాడల్ అభివృద్ధిని దేశానికి అందించడం మరొకటి.
అసలు మన దేశానికి ఉన్న లక్ష్యం ఏమిటి? స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా మనం ఇంకా నీళ్లు, కరెంట్ కష్టాలను ఎదుర్కోవడానికి కారణం ఎవరు? దేశంలో అన్ని వనరులున్నా ప్రజలకు ఇంకా కష్టాలు ఎందుకు ఎదురవుతున్నాయి?… కేసీఆర్ సంధించిన ఈ ప్రశ్నలు ఇప్పుడు దేశంలో పెద్ద చర్చకు దారి తీశాయి. తెలంగాణ ఏర్పడిన కొత్తలో కూడా ఇలాంటి సమస్యలు ఉండేవి. కానీ ఎనిమిదేండ్ల కాలంలోనే ఈ సమస్యలు పరిష్కారమయ్యా యి. దీనికి కారణం ప్రజలు ఎన్నుకొన్న నాయకుడికి చిత్తశుద్ధి ఉండటం. అందుకే ప్రజాసేవ చేయా లనుకున్నప్పుడు ధన్ కీ బాత్ మాట లు వినకుండా మన్ కీ బాత్ మాటలు వినాలని కేసీఆర్ చెప్తారు.
మన దేశానికి సరైన నాయకత్వం ఉంటే ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మారుతుంది. ఏ దేశానికి లేని విధం గా యువ శక్తి, ప్రకృతి వనరులు మనకు అపారంగా ఉన్నాయి. కానీ ఒక విజన్ అంటూ లేని నాయకత్వం ఉండడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులకు ఎంత సేపూ విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావాలనే నీతిమాలిన రాజకీయ ఆలోచనలే తప్ప దేశం స్థితిగతులు మార్చాలన్న ఆలోచన లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన ప్రణాళికలతో, ప్రసంగాలతో దేశ ప్రజలను ఆలోచింప చేస్తున్నారు. అందుకే ఆ సేతు హిమాచలం ఆయనకు మద్దతు ప్రకటిస్తుంది. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం ఇచ్చిన కేసీఆర్కు యావత్ దేశ రైతాంగం జేజేలు పలుకుతున్నది.
కేసీఆర్ త్వరగా ఏ ఒక నిర్ణయానికి రారు. నిర్ణయం ప్రకటించే ముందు రోజుల తరబడి దానిని గురించి క్షుణ్నంగా అధ్యయనం చేస్తారు. ఆ తర్వాతే దాన్ని ఆచరణలోకి తీసుకువస్తారు. ఇలా ప్రణాళిక ప్రకారం పనిచేసే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, అభివృద్ధి చేశారు. ఇప్పుడు మరోసారి విద్వేష రాజకీయాల్లో నలిగిపోతున్న భారతావనికి ఒక భరోసా కల్పించడానికి మరో మహోత్తర పోరాటానికి నడుం బిగించారు.
ఈ పోరాటాన్ని కూడా విజయవంతంగా సాగించి ఆయన విజయం సాధిస్తారనడంలో సందేహం లేదు! బీజేపీకీ కౌంట్డౌన్ మొదలైంది. ఒక్కొక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ వడివడిగా అడుగులు వేసుకుంటూ దేశ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి దూసుకు వస్తున్నది. కేసీఆర్పై బీజేపీ ఎన్ని పన్నాగాలు పన్నినా అవి చెల్లవు. జనం కోసం పోరాడుతున్న నాయకుడి వెంటే ఆ జనం ఉంటారనే సత్యాన్ని చరిత్ర ప్రతిసారీ రుజువు చేస్తున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వంలో మహోజ్వల భారతావని ఆవిష్కృతం అవుతుందనేది దేశ ప్రజల ఆకాంక్ష.
అసలు మన దేశానికి ఉన్న లక్ష్యం ఏమిటి? స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా మనం ఇంకా నీళ్లు, కరెంట్ కష్టాలను ఎదుర్కోవడానికి కారణం ఎవరు? దేశంలో అన్ని వనరులున్నా ప్రజలకు ఇంకా కష్టాలు ఎందుకు ఎదురవుతున్నాయి?… కేసీఆర్ సంధించిన ఈ ప్రశ్నలు ఇప్పుడు దేశంలో పెద్ద చర్చకు దారి తీసాయి. తెలంగాణ ఏర్పడిన కొత్తలో కూడా ఇలాంటి సమస్యలు ఉండేవి. కానీ ఎనిమిదేండ్ల కాలంలోనే ఈ సమస్యలు పరిష్కారమయ్యాయి. దీనికి కారణం ప్రజలు ఎనుకున్న నాయకుడికి చిత్త శుద్ధి ఉండటం.
ఐ.రాధాకృష్ణ: 95539 55316