తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శమని కేంద్రప్రభుత్వం గత ఏడాది చివరలో విడుదల చేసిన ‘గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్’ స్పష్టం చేసింది. వాణిజ్యం, పరిశ్రమలు, సాంఘిక సంక్షేమంలో ఇతర రాష్ర్టాల కంటే తెలంగాణ ముందున్నదని పేర్కొన్నది. ఇది మన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన విధానాలకు లభించిన గౌరవం.
1991 నుంచి పాలనను గవర్నెన్స్ అని పిలవడం మొదలైంది. నూతన సమాచార సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన మౌలిక వ్యవస్థలు పరిపాలన స్వరూపాన్ని మార్చివేశాయి. ఈ నేపథ్యంలో సుపరిపాలన లేదా గుడ్ గవర్నెన్స్ అనే విషయం ముందుకొచ్చింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి పుట్టిన రోజున కేంద్రప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ రోజుగా నిర్వహిస్తున్నది. దీనిలో భాగంగా ‘గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్’ను ఏటా కేంద్రప్రభుత్వ సంస్థలు విడుదల చేస్తున్నాయి. దేశంలో ఏయే రాష్ర్టాలలో ఏ సంస్కరణలు తీసుకువస్తున్నారు? వాటిని ఆయా ప్రభుత్వాలు ఎలా అమలు చేస్తున్నాయి? పౌరులకు సరైన సేవలు అందుతున్నాయా? లేదా? తదితర అంశాలపై గుడ్ గవర్నె న్స్ నివేదిక వివరాలను వెల్లడిస్తుంది. గత ఏడాది డిసెంబర్ 25న తాజా నివేదిక విడుదలైంది. ఇందులో పది అంశాలను తీసుకొని వాటి ఆధారంగా వివిధ రాష్ర్టాలకు ర్యాంకులను ఇచ్చారు. ఆ 10 అంశాలు ఏమిటంటే.. 1. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, 2. వాణిజ్యం, పరిశ్రమలు, 3. మానవ వనరుల అభివృద్ధి, 4. ప్రజారోగ్యం, 5. పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు యుటిలిటీస్, 6. ఆర్థికపాలన, 7. సాంఘిక సంక్షేమం, 8. న్యాయవ్యవస్థ ప్రజాభద్రత, 9. పర్యావరణం, 10. పౌర కేంద్రీకృత పాలన.
ఈ నివేదిక ప్రకారం దేశంలోని రాష్ర్టాలను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏ లో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, హర్యాన, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్; గ్రూప్-బీ లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్; గ్రూప్-సీ లో ఉత్తరాది రాష్ర్టాలు, ఈశాన్య రాష్ర్టాలు; గ్రూప్-డీ లో కేంద్రపాలిత ప్రాంతాలను చేర్చారు. గ్రూప్-ఏలో ఉన్న తెలంగాణ రాష్ట్రం వాణిజ్యం, పరిశ్రమలు, సాంఘిక సంక్షేమంలో దేశంలో అన్ని రాష్ర్టాలకంటే మొదటి స్థానంలో ఉన్నదని ‘గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్-2021’ తెలియజేసింది. దీని వెనుక రాష్ట్రప్రభుత్వ అకుంఠిత దీక్ష ఉన్నది. గత ఏడేండ్లుగా ఈ రంగా ల్లో తీసుకున్న చర్యల కారణంగా నేడు దేశానికే దారి చూపే స్థాయిలో తెలంగాణ నిలిచింది.
తెలంగాణ ఏర్పాటు కాగానే రాష్ట్ర పారిశ్రామికఅభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యం లో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. దేశం ఎన్నడూ చూడనటువంటి పారిశ్రామిక అనుకూల విధానాన్ని ప్రకటించింది. పలు రాయితీలు కల్పించింది. దీనివలన స్వదేశీ, విదేశీ పెట్టుబడులు తరలి వచ్చాయి. ఫలితంగా రాష్ట్రంలో ఉపాధి అవకాశా లు పెరుగటమేగాక ప్రభుత్వ ఖజానాకు ఆదా యం పెరిగింది. సాంఘిక సంక్షేమం విషయానికి వస్తే మైనారిటీ, బీసీ తదితర విద్యార్థుల రెసిడెన్షియల్ హాస్టల్స్ 2014లో కేవలం 298 ఉండగా, 2021కి అవి 923కి పెరిగాయి. ఇవి రాష్ట్రంలో విద్యారంగంలో గొప్ప మార్పులకు కేంద్రంగా నిలిచాయి.
2017 నుంచి ‘హెల్తీ స్టేట్స్ ప్రోగ్రెసివ్ ఇండి యా’ పేరుతో దేశంలో ఆరోగ్యరంగంలో బాగా కృషి చేస్తున్న రాష్ర్టాలకు ర్యాంకులు ఇస్తూ నివేదికను విడుదల చేస్తున్నారు. ప్రపంచబ్యాంకు సహకారంతో నీతిఆయోగ్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్తంగా ప్రతి సంవత్సరం ‘హెల్త్ ఇండెక్స్’ను విడుదల చేస్తుంది. దీంట్లో దేశంలోని రాష్ర్టాలను, కేంద్రపాలిత ప్రాంతాలను మూడు గ్రూపులుగా విభజించారు.
19 పెద్ద రాష్ర్టాలను ఒక గ్రూపులో (తెలంగాణ దీంట్లోనే ఉంది), 8 చిన్న రాష్ర్టాలను ఒక గ్రూపులో, కేంద్రపాలిత ప్రాంతాలను ఒక గ్రూపులో తీసుకున్నారు. వీటిలో ఆరోగ్య పురోగ తిపై ఇటీవల నివేదిక విడుదల చేశారు. కేరళ, తమిళనాడు తొలి రెండు స్థానాల్లో ఉండగా, తెలంగాణ మూడవ స్థానంలో నిలిచింది. చివరిదైన 19వ స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఈ జాబితాలో చివరి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టా లున్నాయి. వీటిలో తొలి మూడు బీజేపీ పాలనలో ఉన్న రాష్ర్టాలు కావటం గమనార్హం. తెలంగాణ గతంలో సాధించిన 65.74 స్కోరు నుంచి ప్రస్తుతం 69.96కి స్కోరును పెంచుకున్నది. అంటే ఒక్క ఏడాదిలో 4.22 శాతం పాయింట్లు పెరిగాయి. హెల్త్ ఇండెక్స్లో 65 శాతం కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన రాష్ర్టాలను ఫ్రంట్ రన్నర్గా, 47 నుంచి 65 శాతం మధ్య పాయింట్లు సాధించిన రాష్ర్టాలను అచీవర్స్గా, 47 శాతం కంటే తక్కువ స్కోరు ఉన్న రాష్ర్టాలను ఆస్పరెంట్గా పేర్కొన్నారు.
రాబోయే సంవత్సరాల్లో ‘హెల్త్ ఇండెక్స్’లో దేశంలో తెలంగాణ మొదటి స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు అనేకం ఉన్నాయి. దీనికి కార ణం.. రాష్ట్రప్రభుత్వం ఆరోగ్య రంగానికి ఇస్తున్న ప్రాధాన్యమే. పెద్ద మొత్తంలో నిధులను కేటాయిస్తూ ప్రభుత్వ దవాఖానాలను ప్రైవేటు హాస్పిటళ్లకు దీటుగా తీర్చిదిద్దారు. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ అనేక సేవలను అందిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఫార్మా కంపెనీల హబ్గా పేరుపొందగా, వైద్యపరికరాల తయారీ కంపెనీలు కూడా హైదరాబాద్కు తరలి వస్తున్నాయి. కాబట్టి, రానున్న రోజుల్లో తెలంగాణ భారతదేశంలోనే అత్యంత ఆరోగ్యకరమైన రాష్ట్రంగా పేరు తెచ్చుకునే అవకాశం ఉన్నది.
‘హెల్త్ ఇండెక్స్’లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. దీనికి కారణం.. రాష్ట్రప్రభుత్వం ఆరోగ్య రంగానికి ఇస్తున్న ప్రాధాన్యమే. పెద్ద మొత్తంలో నిధులను కేటాయిస్తూ ప్రభుత్వ దవాఖానాలను ప్రైవేటు హాస్పిటళ్లకు దీటుగా తీర్చిదిద్దారు. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ
అనేక సేవలను అందిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం వాణిజ్యం, పరిశ్రమలు, సాంఘిక సంక్షేమంలో దేశంలో అన్ని రాష్ర్టాలకంటే మొదటి స్థానంలో ఉన్నదని ‘గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్-2021’ తెలియజేసింది. దీని వెనుక రాష్ట్రప్రభుత్వ అకుంఠిత దీక్ష ఉన్నది. గత ఏడేండ్లుగా ఈ రంగాల్లో తీసుకున్న చర్యల కారణంగా నేడు దేశానికే దారి చూపే స్థాయిలో తెలంగాణ నిలిచింది.
(వ్యాసకర్త: సహాయ ఆచార్యులు ప్రభుత్వ పాలనాశాస్త్ర విభాగం కాకతీయ విశ్వ విద్యాలయం)
– డా. ఆకుతోట శ్రీనివాసులు
98480 73582