‘ఎద్దేడ్సిన ఎవుసం.. రైతేడ్సిన రాజ్యం’బాగుపడదని తెలంగాణల ఓ సామెత. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం ‘రైతు’ను ‘రాజు’ను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ముందుగా రైతు ఆత్మహత్యలను అరికట్టే బాధ్యత తీసుకున్న ప్రభుత్వం ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ ను పునర్నిర్మిస్తున్నది. సీఎం కేసీఆర్ రైతులకు వెన్నుదన్నుగా ఉండటానికి తీసుకువచ్చిన అనేక రై తు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా పంటలు పండించడానికి కా వాల్సిన పెట్టుబడి ‘రైతుబంధు’, 24 గంటల కరెంటును సరఫరా చేస్తూ రైతు సంక్షేమ ప్రభు త్వం తెలంగాణ రాష్ట్రం నిరూపించుకుంటున్నది.
‘మిషన్ కాకతీయ’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 54 వేలకు పైగా చెరువులకు మరమ్మతులు నిర్వహించింది. బృహత్తరమైన ‘కాళేశ్వరం’ ప్రాజెక్టును నిర్మించింది. తద్వారా రాష్ట్రంలో భూగర్భజలాలు పుష్కలంగా పెరిగాయి. భూగర్భ జలాలు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా తెలంగాణలో ఉన్నాయని ఇటీవల కేం ద్రం స్పష్టం చేయడమే దీనికి తాజా ఉదాహరణ.
‘రైతుబంధు’ పథకంలో భాగంగా యాసంగిలోనూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఈ నెల పదో తేదీలోగా 50 వేల కోట్లకు పైగా పెట్టుబడి డబ్బులు రైతులకు అందనున్నాయి.. ఇప్పటికే చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కావడంతో రైతన్నలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రాష్ట్రవ్యాప్తంగా పాలాభిషేకం చేస్తున్నారు. కరోనా లాంటి గత్తరలు తరుముతున్నా రైతుకు సంబంధించిన అంశాలపై సీఎం కేసీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. సమైక్య పాలనలో కరెంటు సమస్య, పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి అనేక మంది రైతులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. అయితే స్వపాలనలో, ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు కనుమరుగయ్యాయి.
దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదంలో రైతు మరణిస్తే ఆ కుటుంబానికి ‘రైతు బీమా’ పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేసి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధిత కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన రైతు సంక్షేమ పథకాలను పలు రాష్ర్టాలు అమలు చేస్తుండగా, ప్రధాని మోదీ సైతం ‘ పీఎం కిసాన్ సమ్మాన్’ పేరిట దేశవ్యాప్తంగా పెట్టుబడి సాయం అందజేస్తుండటం తొలుత కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ ప్రాముఖ్యాన్ని తెలియజేస్తున్నది.
రైతన్నల సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు ‘వ్యవసాయం అంటే దండుగ’ అన్న స్థితి నుంచి ‘వ్యవసాయం అంటే ఒక పండుగ’ అనుకునే స్థాయికి తీసుకువచ్చిన చరిత్ర కేసీఆర్ది. రాష్ర్టాన్ని సాధించడంలో ఎంత మొండిగా ఉద్యమించారో.. అదేస్థాయిలో రైతన్నల కోసం అహర్నిశలు శ్రమించే ముఖ్యమంత్రి కేసీఆర్. మన రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుడుతూ ప్రజాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు. ఇప్పుడు పల్లెలన్నీ పచ్చని పైర్లతో కేసీఆర్కు దీవెనార్తులిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు దూసుకెళ్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కావాలనే అప్రతిష్ట పాల్జేసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయి. ఏడేండ్ల పాలనలోనే ఇంత విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తే, రాష్ర్టాన్ని 60 ఏండ్లకు పైగా ఏలిన రాజకీయ పార్టీలు తెలంగాణకు చేసిం ది మాత్రం శూన్యమనే విషయం ప్రజలకు తెలుసు. రైతు ను కంటికిరెప్పలా కాపాడుకుంటూ ముందుకుసాగుతున్న కేసీఆర్ బాటలో యావత్ రాష్ట్రం నడువాలి.
(వ్యాసకర్త: టీఆర్ఎస్వీ నాయకుడు)
–సంపత్ గడ్డం, 78933 03516