ఒకప్పుడు ఫ్లోరైడ్ రక్కసితో, కరువుతో బాధ పడ్డ మునుగోడు నియోజకవర్గం నేడు తెరిపిన పడింది. మిషన్ భగీరథ వల్ల ఇంటింటికీ రక్షిత మంచినీరు అందుతున్నది. చెరువుల మరమ్మతుల వల్ల వ్యవసాయోత్పత్తి పెరిగింది. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్లే జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎంత? స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి ఎంత అనేది ప్రజలే బేరీజు వేసుకొని రానున్న ఎన్నికల్లో ఓటేయాలి.
దక్షిణ తెలంగాణలో ఒకప్పుడు కరువు జిల్లాగా, ఫ్లోరోసిస్ నిలయంగా నల్లగొండ జిల్లాకు పేరుండేది. మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ అత్యధికంగా ఉండేది. నీళ్లు లేకపోవడం, బోర్లు వేసినా సరిగ్గా పడకపోవడం, చెరువులున్నా మరమ్మతులు లేకపోవడంతో రైతులు, ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. నేను ఇదే నియోజకవర్గంలోని చండూరు మండలం నేర్మట గ్రామంలో పెరిగాను. మా ఊరికి అప్పట్లో సరిగ్గా బస్సులు కూడా నడిచేవి కావు.
ఉమ్మడి రాష్ట్రంలో ఐదు వార్డులకు ఒక నల్లా మాత్రమే బిగించారు. అది కూడా సరిగ్గా రాకపోవటంతో నీళ్ల కోసం ప్రజల మధ్య గొడవ జరిగేది. గతంలో ఈ ప్రాంతం సమస్యల మీద చాలా పాటలు వచ్చాయి. అందులో ‘తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో తడి గొంతులారిపాయే’ లాంటి జానపదా లూ ఉన్నాయి. ఎండా కాలంలో తాగునీటి కోసం బోర్ల వద్దకు వెళ్లడం వల్ల వడదెబ్బ తగిలి అల్లాడి పోయేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ పథకం ద్వారా సీఎం కేసీఆర్ చెరువులు మరమ్మత్తులు చేయించారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయోత్పత్తి పెరిగింది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ రక్షిత మంచి నీరు అంది ఫ్లోరోసిస్ పూర్తి స్థాయిలో తగ్గింది.గతంలో మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా ఫ్లోరోసిస్ ఉన్న మర్రిగూడ మండలం, శివన్నగూడెం, వట్టిపల్లి, నాంపల్లి లాంటి గ్రామాల యువకులకు అమ్మాయిలనిచ్చి పెండ్లి చేయడానికి వాళ్ల తల్లిదండ్రులు ఆలోచించేవాళ్లు. చాలామంది గత్యంతరం లేక బతుకు దెరువు కోసం హైదరాబాద్ పోయి ఏదో పని చేసుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మునుగోడు కోసం చర్లగూడెం చెరువు రిజర్వాయర్ నిర్మాణం జరుగుతున్నది. అది పూర్తయితే మునుగోడు పచ్చని పైర్లతో అలరారుతుంది.
కానీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అరవైఏండ్లు పాలించి ఏం అభివృద్ధి చేసిందో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎక్కువసార్లు గెలిచింది కాంగ్రెస్ నాయకుడు పాల్వా యి గోవర్ధన్ రెడ్డి. కానీ ఆయన చేసిన అభివృద్ధేమీ నియోజకవర్గంలో కనిపించదు! అలాంటి నాయకులున్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే కొద్దిగా మార్పులు చేసి ఇటీవల గ్యారెంటీ కార్డులు అంటూ ప్రచారం చేస్తున్నది. కానీ వాటిని ఉనికి లేని వారంటీ కార్డులని చెప్పవచ్చు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు మునుగోడులో ఫ్లోరోసిస్ రక్కసిని లేకుండా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పవచ్చు. ఇటీవల ము నుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం త్వరితగతిన నెరవేర్చుతున్నది. కాబట్టి మునుగో డు ప్రజలు ఏ పార్టీ తమ సమస్యలను తీర్చి అభివృద్ధి చేసిం దో ఆలోచించి రానున్న అసెం బ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలి.
– కిరణ్ ఫిషర్ 91336 61793