BRS | బీఆర్ఎస్ జాతీయ రంగప్రవేశంతో మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ‘అబ్ కీ బార్…కిసాన్ సర్కార్’ నినాదం రైతులనే కాదు పక్క రాష్ర్టాల ప్రభుత్వ అధికారులను కూడా కదిలిస్తున్నది. తెలంగాణలో అమలులో ఉన్న రైతు సంక్షేమ పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేయాలని అక్కడి రైతులు ఆకాంక్షిస్తుండగా, తాజాగా సీనియర్ సివిల్ సర్వీస్ అధికారి కూడా ఇదే అభిప్రాయం చేశారు.
తెలంగాణలోని రైతుబంధు పథకా న్ని తక్షణం మహారాష్ట్రలో అమలుచేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి, ఔ రంగాబాద్ డివిజనల్ కమిషనర్ ఆ రాష్ట్ర ప్ర భుత్వానికి సూచించారు. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ర్టాలపై ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయో చెప్పే ఒక మంచి ఉదాహరణ ఇది. ముఖ్యం గా మహారాష్ట్ర మరాఠ్వాడ ప్రాంతంలో వ్య వసాయంలో అప్పులపాలైన రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ఈ ఆత్మహత్యలను ఆపాలంటే ఏం చే యాలన్న దానిపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమగ్ర సర్వే చేపట్టింది. రైతుబంధు ద్వారా ప్రతి రైతుకు ఎకరానికి ఏటా రూ. 10,000 పెట్టుబడి సాయం అందిస్తే ఆత్మహత్యలు తగ్గుతాయని అక్కడి అధికారులు ప్రభుత్వానికి సూచించడం అభినందనీయం.
మహారాష్ట్ర రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో దాదాపు 41.80 లక్షల హెక్టార్ల భూమి ఉన్నది. రాష్ట్రంలోని 13.6 మిలియన్ల మంది రైతులలో 48.9 శాతం సన్నకారు రైతులు, 29.5శాతం చిన్న రైతులు ఉన్నారు. భీమా, కృష్ణా, పంచగంగ ప్రధాన నదుల వెంబడి ఉన్న ప్రాంతాల్లో లవణాల ప్రభావం, తక్కువ నీటిపారుదల వంటి సమస్యలున్నాయి. కరువు, గిట్టుబాటు ధర లు, నీటి నిర్వహణ సరిగా లేకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయం దెబ్బతిన్నది. వ్యవసాయ రంగంలో సామాజిక, ఆర్థిక దుర్బలత్వంతో అక్కడి రైతులు బాగా నష్టపోయా రు. ఆర్థిక సమస్యలతో రైతుల పిల్లలు స్కూ ళ్లు మానేస్తున్నారు. వారి ఇండ్లల్లో ఆడపిల్లలకు పెండ్లిళ్లు చేయలేకపోతున్నారని సర్వేలో తేలింది. భూమి ఉన్నా సాగునీటి వసతి లేక పంట దిగుబడి చాలా తక్కువగా వస్తున్నది. ఈ పరిస్థితిలో తెలంగాణలో అమల్లో ఉన్న రైతుబంధు పథకం లాంటిది అక్కడ కూడా అమలు చేయటం తక్షణావసరమని రైతులు అభిప్రాయ పడుతున్నారు. పంట వేయటానికి ముందే రైతులకు ఎకరానికి రూ.10 వేలిస్తే విత్తనాలు, పురుగుమందులు ఇతర వ్యవసాయ వస్తువులు కొనుక్కుంటారని అ ధికారులు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం దేశంలో రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉన్నది. ము ఖ్యంగా మరాఠ్వాడ ప్రాంతంలో గతేడాదిలోనే 1023 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు. 2001 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఏకంగా 10,431 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరాఠ్వాడ ప్రాంతంలో సారవంతమైన భూములున్నా సరైన నీటి వసతి లేదు. దీంతో రైతు లు పూర్తిగా వర్షాలమీదనే ఆధాపడి పంటలు పండిస్తారు. అతివృష్టి, అనావృష్టితో పంట లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
ఒక్కో కుటుంబానికి ఐదు నుంచి ఏడెకరాల భూమి ఉన్నప్పటికీ సరిపడా సాగునీ రు లేక తక్కువ దిగుబడితో రైతులు నష్టపోయారని అక్కడి ప్రజల వాదన.వ్యవసాయాధికారుల అభిప్రాయం ప్రకారం వాతావ ర ణ సంక్షోభ ప్రభావంతో మహారాష్ట్రలో గత ఐదేండ్లలో 36 మిలియన్ హెక్టార్లలో పం టలు దెబ్బతిన్నాయి.
తుఫానులు, ఆకస్మిక వరదలు, మేఘాల పేలుళ్లు, వడగండ్ల వాన లు, కరువు వంటి అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా నష్టం జరిగింది. సెప్టెంబ రు 2022 నుంచి మార్చి 2023 వరకు పం ట నష్టాలను అధికారులు లెక్కించారు. ఏకంగా 46 లక్షల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. దా దాపు రూ.7 వేల కోట్లకు పైగా పంట నష్టం వాటిల్లినట్టు అంచనా.
కరెంటు అందక, సాగునీరు, మద్దతు ధ ర, ప్రభుత్వ చేయూత లేక మహారాష్ట్ర రైతు ల ఆత్మహత్యలకు చిరునామాగా మారి ం ది. కాగా, తెలంగాణ పథకాలపై మహారాష్ట్ర రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుండటంతోపా టు తమకూ ఆ పథకాలు కావాలని డిమాం డ్ చేస్తున్నది. పంట పెట్టుబడి సాయం ఒక్క టే కాదు తెలంగాణ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలన్నీ కావాలని మహారాష్ట్ర రైతులు కోరుకుంటున్నారు.తెలంగాణ మా డల్ ప్రభావం వల్లే ఇటీవల బడ్జెట్లో రైతుల కోసం నిధులను పెంచారు. మహారాష్ట్ర వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గంగా తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు లాంటి పథకం ఆ రాష్ట్రం లో అమలు చేయాలని నిర్ణయించారు.
ఆత్మహత్యలు అత్యధికంగా నమోదవుతున్న మరాఠ్వాడ, పర్భణి పరిధిలోని 14 జిల్లాల్లోని రైతులకు సరఫరా చేస్తున్న గోధుమలకు బదులు ఏటా ఒక్కో రైతుకు రూ.1,800 నేరుగా అందజేయాలని ప్రతిపాదించారు. మిషన్ కాకతీయను స్ఫూర్తిగా తీసుకొని 2016లో ప్రారంభించి, పూర్తి స్థాయిలో అమలుచేయని ‘జలయుక్త్ శివా ర్’ పథకాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ విధంగా తెలంగాణలోని పలు పథకాలు పలు రంగాలలో మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మహారాష్ర్టే కాదు ఇతర రాష్ర్టాలు కుడా తెలంగాణ మాడల్ అభివృద్ధిని ఆయా రంగాల్లో అమలు చేయటానికి సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ మాడల్ దేశానికి విస్తరించేలా బీఆర్ఎస్ కృషిచేస్తున్న తీరు హర్షణీయం.
-డాక్టర్ కందగట్ల శ్రవణ్ కుమార్
86393 74879