దళిత బంధు లాంటి పథకం తెచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా కృతజ్ఞతలు. పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న నేను నిత్యం దళిత కుటుంబాలతో మమేకం అవ్వడం వల్ల దళిత బంధు పట్ల లబ్ధిదారులకు ఉన్న అవగాహనను అవలోకనం చేసే అవకాశం కలుగుతున్నది. ఒక దళిత యువకునితో నేను మాట్లాడినప్పుడు తాను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నానని, తన కొడుకు మహాత్మా జ్యోతిబా పులే స్కూల్లో నాణ్యమైన విద్య అభ్యసిస్తున్నాడని చెప్పారు. దళిత బంధు ద్వారా తనకు ఆర్థిక సాయం అందితే తాను ఒక కారు కొనుక్కొని ఓనర్గా మారి నెలకు రూ.35 వేలు సంపాదిస్తానని నిబ్బరంగా చెప్తుతున్నారు. కొన్ని చోట్ల కొందరు తాము దళిత బంధు సాయం ద్వారా సూపర్ మర్కెట్లు పెట్టి యజమానులుగా మారామని చెప్పారు.
అయితే స్వాతంత్య్రం వచ్చిన ప్పటి నుండి ఈ రాష్ర్టాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులకు దళితులను ధనవంతులను చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదు అనేది మౌలిక మౌఖిక ప్రశ్న. అయితే ఇవాళ దళిత జనాభా 19 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువ మందికి యూనిట్లు మంజూరు చేస్తే ఈ పథకానికి మరింత పరిపూర్ణత వస్తుంది. ఇది నిరంతరంగా కొనసాగాలి. కొంత మంది దళిత బంధు లబ్ధిదారులు ధాన్యం అవసరాలకు తగ్గట్టు గోదాముల నిర్మాణం కూడా చేస్తున్నారు. కాళేశ్వరంపైన అవాకులు చవాకులు పేలే వాళ్లకు ఆ గోదాములు సజీవ సాక్షంగా కనిపిస్తాయని అనిపించింది.
– భారత అవినాష్, జనగామ