ఏదో ఒకటి వాగి రోజూ పేపర్లలో పేరు వచ్చేలా చూసుకోవడం చర్లపల్లి జైలువాసి రేవంత్రెడ్డికి బాగా అలవాటు. మొన్నటిదాకా చింతపండు నవీన్కుమార్ కూడా మీడియాను అడ్డుపెట్టుకొని తన మురికికాలువ వంటి నోటి పారుదల ద్వారా నోట్లు పారించుకునేవాడు. నేడు ఆయన ఆటకట్టు అయింది. నవీన్ కంటే కొంచెం పెద్దరౌడీ అయిన, నవీన్ చేసే పనులే కొంచెం పెద్దస్థాయిలో చేసే రేవంత్రెడ్డి విపక్ష నాయకుడిగా ఉండటం కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం. ఆయనకూ అడ్డుకట్ట పడేరోజు తప్పక వస్తుంది. కాకపోతే అది ప్రజాకోర్టా, న్యాయస్థానాల ద్వారానా- ఏది ముందు అనేది మాత్రమే తేలాల్సి ఉంది.
సొంత మూలాలను గుర్తుంచుకొని రేవంత్రెడ్డి నన్ను ‘గాడిద’ అన్నారేమో.. అంటూ పార్లమెంటరీ ఐటీ- స్థాయీసంఘం చైర్మన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ రేవంత్రెడ్డి నిజస్వరూపాన్ని కండ్లకు కట్టిండు మొన్న. సొంత పార్టీ ఎంపీ గడ్డిపెట్టాల్సి రావడం పీసీసీకి ఏమి శోభస్కరమో కాంగ్రెస్ నాయకులే ఆలోచించుకోవాలి.
యువ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఐటీరంగ అద్భు త ప్రగతిని శశిథరూర్ ప్రశంసించడం రేవంత్కు నచ్చలేదు. రేవంత్కు ఆ హృదయ వైశాల్యం ఉంటుందని మనమేమీ ఆశించలేం కానీ, ‘గాడిద’ అనే పద ప్రయోగం వెనుక అక్కసును మాత్రం గమనించవచ్చు. అసలు రేవంత్ వ్యక్తిత్వమే అంత. ఆయనతో ఎనిమిదేండ్లపాటు టీడీపీలో పనిచేసిన అనుభవం ఈ వ్యాస రచయితది. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న తొట్టతొలి ప్రభుత్వాన్ని అక్రమంగా గద్దెదించాలని చూసి ఓటుకు నోటు కేసు లో ఇరుక్కుపోయి జైలుకు పోయిన రేవం త్, జైలు నుంచి విడుదలై ఏదో ఘనకార్యం చేసినట్టు ఊరేగింపుగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు చేరుకొని మాట్లాడిన మాటలను టీడీపీలో ఉండగానే ఈ వ్యాస రచయిత ‘మిత్రుడికో ప్రేమలేఖ’ పేరున ఓ పత్రికలో రాసిన వ్యాసం రేవం త్ ఏమిటో, ఆయన భావజాలం ఏమిటో స్పష్టపరిచింది. ‘ఆలుగడ్డలు అమ్మేవాళ్లను, కల్లుగీసేవాళ్లను, చెప్పులు కుట్టేవాళ్లను మంత్రులు చేసినం’ అని ఆ రోజు కూసిన రేవంత్, నేడు దళితుల, బహుజనుల సాధికారత అంటూ మాట్లాడటం, ఆత్మగౌరవ సభ లు జరపడం హాస్యాస్పదం. బ్లాక్మెయిలర్, క్రిమినల్ అయిన రేవంత్ ఇప్పుడు విపక్షాలను కలుపుకొని ప్రజా సమస్యల గురించి ఉద్యమిస్తాననడం రేవంత్కు ఏమో కానీ, అవి విపక్ష నాయకులకు ఏమి గౌరవమో వారికే తెలియాలి.
ఇది రేవంత్ను వ్యక్తిగతంగా ఆడిపోసుకోవడం లాగా అనిపించవచ్చు కానీ, శ్రీశ్రీ అంటారు కదా ‘ఎవరి ప్రైవేట్ జీవితం వారి ఇష్టం, పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటాం’అని. రేవంత్ స్వీయ వ్యక్తి స్వామ్య (Sef-Centric) పద్ధతులకు రోసిన నాయకులు నాడు టీడీపీలోనూ, నేడు కాంగ్రెస్లోనూ ఎందరో ఉన్నారు. రేవంత్ తనకు పని ఉంటే తప్ప ఎవరికీ దొరకడని ఆయనతో పనిచేసిన ప్రతీ నాయకుడికీ తెలుసు. ప్రొఫెసర్ కోదండరాం కూడా రేవంత్తో మాట్లాడాలనుకుంటే వేం నరేందర్రెడ్డికి ఫోన్చేసి, రేవంత్ దృష్టికి తీసుకు పొమ్మని అడగాలి. నరేందర్రెడ్డికి మూడ్ ఉంటే, రేవంత్తో చెప్తే, ఆయనకు దయ వస్తే అప్పుడు మాట్లాడుతాడు. నేడు ఒక్క చంద్రబాబు ఫోన్ తప్ప ఎవరి ఫోనూ రేవంత్ ఎత్త డం లేదని కాంగ్రెస్ నాయకులే ప్రైవేట్ సంభాషణల్లో ఆవేదన పడుతున్నారు. రేవంత్ ఎవరి కనుసన్నలలో నడుస్తున్నడో ఆయన భజనపరులకు తప్ప అందరికీ గ్రహింపు ఉన్నది. ఇలాంటి మనిషి విపక్షాలను లీడ్ చేస్తడంట, వారు ఆయనతో పోతరంట! గత అసెంబ్లీ ఎన్నికల్లోనే మహాకూటమి పేరుతో కాంగ్రెస్ ఎంత నీచంగా వ్యవహరించిందో తెలిసిన విపక్షాలు నేడు మరలా కుక్క తోకనే పట్టుకొని గోదారి ఈదుతామని అనుకుంటున్నారు. కానీ, వారి ఆశలు అడియాసలై కాళేశ్వరంలో మునిగిపోతారు!
ఇక, సొంత రాష్ట్రం వచ్చినంక కూడా పక్క రాష్ర్టాల వాళ్లు ఇక్కడ పార్టీలు పెట్టుడు తెంపరితనం. వాళ్లు పిలిస్తే ఇక్కడి విపక్షాలు పొలోమంటూ పోవడం భావదారిద్య్రం. పంతొమ్మిది పార్టీల మహాధర్నాకు షర్మిలనూ పిలిచినమని కాంగ్రెస్ చెప్పడం మంచిదే, వారి సర్వభ్రష్టత తెలంగాణకు శ్రేయస్కరమే.
ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ తెస్తున్నరు కొంతమంది. రేవంత్ వెనుక రెడ్లు ఉన్నరని, ఆయనో బాహుబలి లాగా యుద్ధం చేస్తడని విచిత్రమైన ఆర్గ్యుమెంట్లు నడుస్తున్నయి. కులాల కంపులో మునిగిన ఆంధ్రప్రదేశ్ సమాజం నేడు ఎట్లా తిరోగమన దిశలో పయనిస్తున్నదో ఎరుక కలిగితే, చైతన్యశీలమైన తెలంగాణ సమాజం ఎటుపోకూడదో అర్థమవుతుంది. రెడ్ల విషయానికే వస్తే.. ప్రజాస్వామ్య ప్రియులైన, ప్రతిభావంతులైన, త్యాగమూర్తులైన ఎందరో రెడ్లకు తెలంగాణ ఆలవాలం. రావి నారాయణరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, భీంరెడ్డి నరసింహారెడ్డి మొదలుకొని మర్రి చెన్నారెడ్డి, జైపాల్రెడ్డి, కొండా వెంకటరంగారెడ్డి లాంటి మహనీయుల వరకు తెలంగాణ మేలు కాంక్షించిన మేరునగధీరులు ఎందరో ఉన్న రు. రెడ్లు, ముఖ్యంగా రెడ్డియువత గర్వపడాల్సింది ఇట్లాంటి నాయకుల వారసత్వం పట్ల. అంతే తప్ప రేవంత్ లాంటి పనికిమాలిన సరుకు గురించి కాదు! ఇదేదో నేను రెడ్ల తరఫున వకాల్తా పుచ్చుకోవడానికి కాదు, ఆ భాష తప్ప రేవంత్కు అర్థం కాదు కాబట్టి, వాడాల్సి వస్తున్నది. ఆయనకు అర్థం అయినా, కాకపోయినా యువత అర్థం చేసుకుంటారనే ఆశ అయితే ఉన్నది!
తానేదో సచ్చీలుడు అన్నట్టు రేవంత్రెడ్డి ఇపుడు వైట్ ఛాలెంజ్లు విసురుతున్నాడు. ఆయన చరిత్ర అంతా exotortions మయమే. No exotortions ఛాలెంజ్ విసరాలి రేవంత్కు. ఆయనేమో వాటిని తీన్మార్ మల్లన్న లాంటి వాళ్లకు విసరాలి. తెలంగాణ సమాజం ప్రయోజనం ఇందులోనే దాగి ఉందని కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్లు గ్రహించాలి. అసలు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు ఆలోచించుకోవాలి తమను లీడ్ చేయడం కాదు, తమతో సరిగా నడవగలిగే స్థాయి ఉన్నదా రేవంత్కు అని. శశిథరూర్ గుర్తుపట్టిండు రేవంత్ను, మీడియా ముందు గొంతేసుకొని అరిచే ఇతర కాంగ్రెస్ నాయకులు గ్రహించాలిప్పుడు. క్రిమినల్ కేసుల విషయం ఎందుకులే, రాహుల్గాంధీ ఎందుకులే’ అంటూ పలాయనవాదం పఠించే రేవంత్కు రాష్ట్ర, దేశ రాజకీయాల నుంచి పలాయనం తప్పదు. అది జరగాల్సిందే. అదే సమాజానికి క్షేమకరం.
రేవంత్ సైన్యం కులాల కుంపటి రేగగొట్టి చలికాచుకోవడానికి ప్రయత్నిస్తే, మరొక జాతీయపార్టీ బీజేపీ మతాన్ని నమ్ముకొని రాజకీయం చేస్తున్నది. తెలంగాణలో ఆ పప్పులేమీ ఉడకవు గానీ, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాల మీద, వాటిపై కేంద్ర అలసత్వం మీదారాష్ట్ర బీజేపీ నాయకులు దృష్టిపెడితే ఉనికి అయినా నిలుస్తది. ఇంతకంటే వారిగురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు!
నేడు తెలంగాణ అభివృద్ధి గురించి తెరాస నాయకులు మాత్రమే చెప్పనక్కరలేదు. ఆర్బీఐ చెప్తున్నది, నీతి ఆయోగ్ చెప్తున్నది, కేంద్ర మంత్రిత్వ శాఖలు చెప్తున్నవి, అంతర్జాతీయ/ జాతీయ మీడియా రాస్తున్నది. కేసీఆర్ దార్శనికతలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని చెప్పడానికి కావలసినన్ని గణాంకాలు పబ్లిక్ డొమైన్లో లభ్యంగా ఉన్నవి. తెలంగాణ మరింత ప్రగతిశీలతతో పయనిస్తూ దేశ విదేశాల్లో జయపతాక ఎగురవేయడానికి తెలంగాణ ప్రజ, ముఖ్యంగా యువత నిర్మాణాత్మక సూచన లూ, భాగస్వామ్యమూ అవసరం. సామాజిక మాధ్యమాల ద్వారా, క్షేత్రస్థాయి రచ్చబండల ద్వారా ఈ దిశగా చర్చ జరగాలి, కార్యాచరణ సాగాలి. అమూల్యమైన సమయం అనర్హ నాయకుల మీద వెచ్చిస్తే భవిష్యత్తరాలు నష్టపోతాయి.
భర్తృహరి రాయగా, ఏనుగు లక్ష్మణకవి తెనిగించిన ఈ పద్యం చూడండి ఓసారి…
‘ఆరంభింపరు నీచ మానవులు
విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు
విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచు
ధ్రుత్యున్నతొత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ
ప్రజ్ఞానిధలల్ గావునన్..’
ఏదైనా పని మొదలుపెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెరువక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్యసాధకుడి నైజం. అలాంటివారు ఉత్తము లు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకొని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలుపెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసే వారు మధ్యములు.
ఇప్పుడు తెలంగాణ సమాజం అధములనూ, మధ్యములనూ వదిలేసి ఉత్తముల పక్షాన ఉండటం ఉత్తమం! చిన్నపుడు సోషల్ పుస్తకాల్లో చదువుకున్నం-కోసి నదిని బీహార్ దుఃఖదాయిని అని, దామోదర్ నదిని బెంగా ల్ దుఃఖదాయిని అంటారని. నేడు తెలంగాణకు దుఃఖ దాయకుడు, ఆంధ్రా కనుసన్నలలో రాజకీయం చేసే రేవంత్రెడ్డి. ఆయన పట్ల అప్రమత్తత, జాగరూకత నేటి తెలంగాణకు అవసరం!
శ్రీశైల్రెడ్డి పంజుగుల