ఉమ్మడి రాష్ట్రంలోని బీసీ సంక్షేమ శాఖకు రూ.5,106 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది తెలంగాణ రాకముందటి ముచ్చట. కానీ బీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5,522 కోట్లను కేటాయించింది. ఇది తెలంగాణ వచ్చిన తర్వాతి ముచ్చట.
తెలంగాణలో వెనుకబడిన వర్గాల కోసం, సమాజంలో ఏండ్ల తరబడి వివక్ష ఎదుర్కొం టూ పోరాడిన సమూహాల కోసం ముఖ్య మంత్రి కేసీఆర్ సంకల్పించిన ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఏ గడ్డపై ఆత్మగౌరవం కోసం నినదించామో అదే గడ్డపై స్వరాష్ట్రంలో సగర్వంగా దాదాపు 40 ఎంబీసీ, బీసీ కులా లు గూడును కట్టుకోబోతున్న సమయంలో నేనుండటం అదృష్టంగా భావిస్తున్నాను. హైదరాబాద్లోని అత్యం త ఖరీదైన కోకాపేట, ఉప్పల్ బగాయత్, అబ్దుల్లాపూర్మెట్ లాంటి ప్రాంతాల్లో దాదాపు 84 ఎకరాల్లో ఈ భవనాలు నిర్మించబోతున్నాం.
విద్యాభివృద్ధే సమాజ ప్రగతికి చోదకశక్తి అని నమ్మిన సీఎం కేసీఆర్ మహాత్మా జ్యోతిబాపూలే అడుగుజాడల్లో బీసీ సంక్షేమ శాఖను నడిపిస్తున్నారు. స్వరాష్ర్టానికి ముందు కేవలం 7,580 మంది విద్యార్థులతో, రూ.44 కోట్ల అరకొర నిధులతో 19 బీసీ విద్యాసంస్థలు పనిచేసేవి. కానీ ప్రస్తుతం సొసైటీకి మహాత్మా జ్యోతిబాపూలే పేరు పెట్టుకొని దాదాపు 1,40,000 విద్యార్థులకు విద్యను బోధిస్తున్నాం. ఒక డిగ్రీ కళాశాల, 19 జూనియర్ కళాశాలలు, 261 స్కూళ్లలో 119 స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసి రాష్ట్రవ్యాప్తంగా 281 విద్యాసంస్థలను నిర్వహిస్తున్నాం. ఇందుకోసం ఈయేడు రూ.619 కోట్లను ఖర్చుచేస్తున్నాం. వీటికి అదనంగా బీసీల కోసం 697 సంక్షేమ హాస్టళ్లను నిర్వహిస్తున్నాం. బీసీ సంక్షేమశాఖ పరిధిలోని ప్రతి విద్యార్థికి సన్న బియ్యం తో భోజనం పెట్టే సంకల్పాన్ని కొనసాగిస్తున్నాం. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బీసీ విద్యార్థుల కోసం మెయింటనెన్స్ ఫీజు, ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తు న్నాం. ప్రభుత్వం దీనికోసం రూ.1,3 15 కోట్లను కేటాయించింది. 11 బీసీ స్టడీ సర్కిళ్లకు అదనంగా సిరిసిల్లలో ఈ సంవత్సరం మరో స్టడీ సర్కిల్ ఏర్పాటు కానున్నది. దీంతో పాటు 119 స్టడీ సెంటర్లను ప్రతీ నియోజకవర్గంలో ఏర్పాటుచేయబోతున్నాం. ఇవి ఆన్లైన్లో పాఠ్యాంశాలను బోధిస్తూ పోటీ పరీక్షల్లో బీసీ విద్యార్థులు తమ ప్రగతి చూపడానికి దోహదపడుతాయి. విదేశీ విద్య కోసం పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్లను అందిస్తున్నాం.
కరోనా సంక్షోభం లాంటి తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ పౌరసరఫరాల శాఖ గత యాసంగిలో 6,968 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతి గింజను సేకరించింది. కొనుగోలు వివరాలను మిల్లర్లు ఓపీఎంఎస్లో నమోదు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో దాదాపు రూ.26,643 కోట్లు డబ్బులు జమచేశాం. ఇంత పెద్ద ఎత్తున వచ్చిన పంటను నిల్వ, మిల్లింగ్ చేయడానికి శ్రమకోర్చి అన్నిరకాలుగా వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం. అంటే సీఎం కేసీఆర్ తీసుకున్న విధానాలు ఏ రీతిలో ప్రతిఫలించాయో అర్థం చేసుకోవచ్చు.
ఇలా.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో బీసీ సంక్షేమశాఖ, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా రెం డేండ్లు పూర్తిచేసుకోవడం గర్వంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
(వ్యాసకర్త: రాష్ట్ర మంత్రి)
గంగుల కమలాకర్