సీమాంధ్ర వలస పాలకుల అసమర్థ పాలన వల్ల కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థకు బీజం పడింది. వారికి చాలీచాలని జీతాలు. కాంట్రాక్టు ఉద్యోగ సంఘాలు చేసిన విన్నపాలు, పోరాటాలను నాటి పాలకులు పట్టించుకోలేదు. కానీ ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట నిలుపుకొన్న సీఎం కేసీఆర్ నిజంగా ప్రజా పక్షపాతి అని నిరూపించుకున్నారు.
ఇచ్చిన మాట ప్రకారం.. కేసీఆర్ అధికారం చేపట్టిన తొలి ఏడాది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం జీవో నెంబర్-16ను జారీచేస్తే, విపక్షాల ద్వంద్వవైఖరి వల్ల కోర్టులో అడ్డంకులు ఏర్పడ్డాయి. ఏనాడైన కేసీఆర్ మాత్రమే మాకు న్యాయం చేస్తారనే ధీమాతో కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. వీరి నమ్మకానికి అనుగుణంగానే రెగ్యులర్, కాంట్రాక్టు అనే తేడా లేకుండా సమాన పనికి
సమాన వేతనంగా కాంట్రాక్టు ఉద్యోగులందరికీ 2017లో కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసింది. 2021లో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా పీఆర్సీ వర్తించే చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించి అమలు చేశారు.
తాజాగా కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అన్ని ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించడం చారిత్రాత్మకమైన నిర్ణయం, హర్షణీయం. ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాల ద్వారా సబ్బండవర్ణాలకు న్యాయం చేసిన కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడం పట్ల కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని ప్రకటిస్తున్నారు.
(వ్యాసకర్త: ప్రధాన కార్యదర్శి, కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల సంఘం)
– డా.తిరుపతి పోతరవేణి
9963117456