తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి, ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చి, ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహానాయకుడు మన కేసీఆర్. తెలంగాణ స్వరాష్ట్రం కోసం పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టిన ఉద్యమ ధీశాలి కేసీఆర్. ఉద్యమ స్పూర్తితోనే బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సబ్బండ వర్గాలకు అందిస్తున్న దేశం గర్వించదగ్గ పరిపాలనదక్షుడు మన కేసీఆర్. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో, ఇంటిపార్టీగా ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ మునిగి పోయే పడవ. ముఖ్యమంత్రి కేసీఆర్ పై నానాటికి పెరుగుతున్న విశ్వసనీయతకు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్న వలసల ప్రవాహమే నిదర్శనం. రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం అవుతుందన్న నమ్మకం ప్రజల్లో బలపడింది. దాంతో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారు.
వ్యవసాయ రంగంలో అద్భుతాలను సృష్టించాలనే ఉద్ధేశంతో కేసీఆర్ అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. రైతుల్లో నవచైతన్యానికి సీఎం కేసీఆర్ నాంది పలికారు. రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం ఎకరాకు రూ.10వేలు పంట సాయం అందిస్తున్నది. ఇప్పుడు 16 వేలకు పెంచారు. అన్నదాత మృతి చెందితే వారం రోజుల్లోనే రైతుబీమా పథకం ద్వారా చనిపోయిన రైతు కుటుంబానికి సర్కారు రూ.5 లక్షలు అందజేస్తున్నది. రైతులు పండించిన పంటకు మార్కెటింగ్, గిట్టుబాటు ధర అందిస్తున్నది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా వ్యవసాయ రంగానికి కీలకంగా మారిన సాగునీరు, విద్యుత్తు, పెట్టుబడి సాయం,విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుతున్నాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా నీరు అడుగంటిన 45 వేల చెరువులను పునరుద్ధరించారు. 24 గంటల ఉచిత విద్యుత్తుతో అన్నదాతల్లో విశ్వాసం పెరిగింది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సాగుకు స్వర్ణయుగం కొనసాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు ప్రాజెక్టుల నిర్మాణాలను నిర్లక్ష్యం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 17వేల కోట్ల రుణమాఫీ, రెండోసారి అధికారంలోకి రాగానే లక్ష లోపు ఉన్న రుణమాఫీ చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి బడ్జెట్ నుంచే ప్రతీసారి 25 వేల కోట్లు కేటాయిస్తూ పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలపై కేసీఆర్ దృష్టి పెట్టారు. కేవలం మూడున్నరేండ్లలో కాళేశ్వరం లాంటి చరిత్రాత్మక ప్రాజెక్టును నిర్మించి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ది. కేసీఆర్ను అర్థం చేసు కోవడంలో విఫలమైతే, నష్టపోయేది తెలంగాణ సమాజమే..తెలంగాణను అర్థ్ధం చేసుకోవడంలో కేసీఆర్ వంద శాతం సఫలమవుతూనే ఉన్నారు. ఆయన విజయవంతంగా నడిపిన తెలంగాణ ఉద్యమం, ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.
ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎలా ఉంది? ఇప్పుడు కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ ఎలా ఉందో తెలంగాణ సమాజం గమనించాలి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఇలా అన్నింటిలో దేశంలోని మిగతా రాష్ర్టాల కంటే తెలంగాణ అగ్ర భాగాన ఉన్నది. తెలంగాణ మేలు కోసం కేసీఆర్ పడుతున్న తపనను, ఆరాటాన్ని మనమంతా గుర్తించాలి.దళితబంధు వంటి పథకాన్ని అందరికీ అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. రైతుల మేలుకోసం రైతుబంధు, రైతుభీమా, రుణ మాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్తు, సాగు నీటి ప్రాజెక్టులు, చెరువులు, ధాన్యం కొనుగోళ్లు ఇవన్నీ అమలు చేస్తున్నందువల్ల ఎక్కువ శాతం లాభ పడింది భూములు ఎక్కువగా ఉన్న ఓసీ, బీసీ వర్గాలే.
కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ మీద, తెలంగాణ లోని అన్ని వర్గాల ప్రజల మీద ప్రేమతోనే చేశారు. కేసీఆర్ లాంటి ఒక దమ్మున్న నాయకుడు లేకే గతంలో తెలంగాణ రాష్ట్రం చాలా నష్టపోయింది. ఇప్పుడు అలాంటి ఒక మంచి నా యకుడిని దూరం చేసుకుంటే మళ్ళీ తెలంగాణ కోలుకోలేని స్థితికి చేరుకుంటుంది. కేసీఆర్ సారు సల్లగుండాలె. సారు మళ్లీ రావాలి..దేశ్ కీ నేత కావాలి..దేశమంతా మన పథకాలు రావాలి.
– ఆలేటి రమేశ్ 99487 98982