ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొట్లాడి సాధించుకున్న తెలంగాణను తొమ్మిదేండ్లలోనే దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. సబ్బండ వర్గాల ఐకమత్యమే అండ దండలుగా మలచుకొని గెలిచి నిలిచిన నిలువెత్తు విజేత తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే తిరిగి బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి తీసుకు రావలసిన అవసరం ఉన్నది.
అనేక సమస్యలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ర్టాన్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ నేడు దేశంలోనే అగ్రరాష్ట్రంగా తీర్చిదిద్దారు కేసీఆర్. రాష్ట్రం వచ్చేనాటికి అత్యవసరమైన జఠిలమైన కరెంటు సమస్యను పరిష్కరించి నేడు 24 గంటల కరెంటు ఇస్తున్న ఒకే ఒక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. మనిషి మనుగడకు అవసరమైన మంచి నీటిని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ అందించే కార్యక్రమాన్ని అనతికాలంలోనే పూర్తి చేశారు. మిషన్ కాకతీయతో వ్యవసాయానికి అవసరమైన గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ పనులు ముమ్మరంగా చేసి నీటి వనరులను పెంచారు. తద్వారా భూగర్భ జలాలు పెరిగాయి.
వ్యవసాయ మార్కెట్లు ఆధునీకరించటంతో పాటు గ్రామగామాన రైతు వేదికలు నిర్మించారు. వ్యవసాయం దండుగ అన్న ఉమ్మడి పాలకుల నోర్లు మూతపడేలా వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత సీఎం కేసీఆర్ది. రైతులకు పెట్టుబడి కోసం రైతుబంధు, ఎరువులు, రైతుబీమాలతో పాటు 24 గంటల కరెంట్ ఇచ్చి వ్యవసాయాన్ని స్థిరీకరించారు. రైతులకే భూముల మీద అధికారం ఉండేలా ధరణిని తీసుకొచ్చి భూ హక్కులను కల్పించారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, బోదకాలు, కిడ్నీ బాధితులకు, వికలాంగులకు ఆసరా పింఛన్లు ఇచ్చి వారిలో ఆత్మైస్థెర్యం నింపారు. పూజారులు, ఇమామ్లు, మౌజంలకు గౌరవ వేతనం అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్నే. ఉమ్మడి పాలనలో శంకుస్థాపనలకే పరిమితమైన ప్రాజెక్టుల మీద దృష్టి సారించి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుగా గుర్తింపు తీసుకొచ్చా రు. తెలంగాణలో నలువైపులా అన్నపూర్ణ సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్లతో రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారు.
చేప పిల్లల ఉచిత పంపిణీతో నీలి విప్లవాన్ని తీసుకొచ్చి గంగపుత్రులు, ముదిరాజుల ఆదాయాన్ని పెంచారు. గొల్ల కుర్మలకు గొర్లను పంచి స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించి వారి జీవితాల్లో ఆనందాలు పంచారు. మైనారిటీలకు 204 గురుకులాలు ఏర్పాటు చేసి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దటంలో ముందుచూపుతో వ్యవహరించారు సీఎం. ఆడబిడ్డల పెండ్లిల కోసం కల్యాణలక్ష్మీ , షాదీ ముబారక్లను ప్రవేశపెట్టి లక్షా నూట పదహార్లు అందిస్తున్న మేనమామ మన కేసీఆర్. ఉండటానికి గూడు లేని నిరుపేదల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించి వారి కండ్లల్లో ఆనందం నింపిన గొప్ప మానవతా మూర్తి ముఖ్యమంత్రి కేసీఆర్.
అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాలు, పోలీస్ కమీషనరేట్ కార్యాలయాలు నిర్మించి పాలనా వ్యవస్థను గ్రామీణ ప్రజలకు చేరువ చేశారు. వైద్యారోగ్యాన్ని ప్రోత్సహించడానికి 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయడంతో పాటు బస్తీ, గ్రామీణ దవాఖానలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ, అంగన్వాడీ, సఫాయి కార్మికుల సమస్యలు పరిష్కరించి వారిలో ఆనందం నింపారు. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీ అయ్యే వారికి కేసీఆర్ కిట్లు అందిస్తున్నారు. తెలంగాణను ఐటీ హబ్గా మార్చి వేలాదిమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అంబేద్కర్ సచివాలయం, అమరుల స్థూపం, అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు కేసీఆర్.
రైతులకు పెట్టుబడి కోసం రైతుబంధు, ఎరువులు, రైతుబీమాలతో పాటు 24 గంటల కరెంట్ ఇచ్చి వ్యవసాయాన్ని స్థిరీకరించారు. రైతులకే భూముల మీద అధికారం ఉండేలా ధరణిని తీసుకొచ్చి భూ హక్కులను కల్పించారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, బోదకాలు, కిడ్నీ బాధితులకు, వికలాంగులకు ఆసరా పింఛన్లు ఇచ్చి వారిలో ఆత్మైస్థెర్యం నింపారు.
ఇట్లా ఒక్కరని కాదు, ఒక్కటని కాదు అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అన్ని రకాలుగా లబ్ధి పొందేలా సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వం నుంచి ఏదో ఒక విషయంలో సాయం పొందని వ్యక్తి తెలంగాణలో లేరంటే అతిశయోక్తికాదు. అందుకే కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవలసిన అవసరం, గురుతర బాధ్యత మనసున్న ప్రతి తెలంగాణ ఓటరుపై ఉన్నది.
– రుస్తుం మహ్మద్ 94403 95537