పల్లె, పట్టణాల అభివృద్ధికి నిధులను విడుదల చేస్తానని మాటిచ్చిన సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు. ఈ మేరకు జిల్లాకు రూ. 108.75కోట్ల నిధుల మంజూరుకు సంబంధించి గురువారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వు లు వెలువడ్డాయి. జూన్ 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని సీఎం దత్తత గ్రామం వాసాలమర్రికి వచ్చిన సందర్భంగా జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షల చొప్పున రూ. 105.25 కోట్లు, 6 మున్సిపాలిటీలకు రూ.3.50కోట్లు మంజూ రు చేస్తున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లుగానే..నిధులను మంజూరు చేసి పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. తాజాగా..విడుదలైన నిధులు పల్లె, పట్టణ ప్రగతి పనుల వేగవంతానికి ఊతం ఇవ్వనుండగా.. నిధుల మంజూరుపై ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, జూలై 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సంక్షోభ సమయంలోనూ పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధికి ఆటంకం కలగకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నా రు. ఈక్రమంలోనే వాసాలమర్రి గ్రామ పర్యటనకు వచ్చిన సందర్భంగా మున్సిపాలిటీలు, పంచాయతీలకు భారీగా నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి గొప్ప ఊరటను కల్పించారు. జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ.25లక్షల చొప్పున రూ.105.25కోట్లను, భువనగిరి మున్సిపాలిటీకి రూ.కోటి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు, భూదాన్పోచంపల్లి మున్సిపాలిటీలకు రూ.50లక్షల చొప్పున మొ త్తం రూ.3.50కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ‘స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఫర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ 2021-22’ స్కీం కింద నిధుల ను మంజూరు చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.మున్సిపాలిటీలలో మౌలిక సదుపాయాల కల్ప న దిశగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పురోగతిలో ఉండగా.. పల్లె ప్రగతిలో భా గంగా ప్రతి పంచాయతీలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలతోపాటు వైకుంఠధామా లు, సీసీ రోడ్లు, డంపింగ్ యార్డుల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా చేపడుతున్నది.
తాజాగా.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాకు పెద్దమొత్తంలో నిధులను మంజూరు చేయడంతో మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ప్రగతికి మరింతగా ఊతం ఇచ్చినైట్లెందని ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.