యాదగిరిగుట్ట రూరల్, మే 9 : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి సన్నిధిలో సోమవారం స్వామి వారికి విశేష పూజలు జరిగాయి. ప్రధానాలయంలోని స్వయంభువులకు అర్చకులు నిజాభిషేకం, సహస్రనామార్చనలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజ చేశారు. కొండపైన రామలింగేశ్వర స్వామి సన్నిధిలో మూల మూర్తులను, మండపంలోని స్పటికమూర్తులను పంచామృతాలతో అభిషేకించారు. స్వామి వారికి వివిధ విభాగాల ద్వారా రూ.14,29,597 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామిని హైకోర్టు న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.