కాచిగూడ : డెమో రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని మహిళ (55) మంగళవారం ఉప్పుగూడ- యాకత్పుర రైల్వేస్టేషన్ల మధ్య పట్టాల పక్కన నడుచుకుంటూ వెలుతుండగా అదే సమయంలో డెమో రైలు ఢీకొనడంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతురాలి ఒంటిపై పసుపు రంగు చీర, ఎరుపు రంగు జాకెట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతి చెందిన మహిళ వివరాలు కోసం 8143807592, 040-27568355లో సంప్రదించవచ్చని కోరారు.