కందుకూరు : మండల పరిధిలోని కొత్తగూడ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కావాల్సిన నిధులను మంజూరు చేస్తానని ఈ విషయంలో ఆందోళన చెందవద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
మంగళవారం ఎంపీపీ మంద జ్యోతి పాండు, జిల్లా పంచాయతీరాజ్ కన్వీనరు సర్పంచ్ సాధ మల్లారెడ్డి, కొత్తూరు ఎంపీటీసీ బొక్క జ్యోతి నర్సింహరెడ్డిలు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి గ్రామ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
గ్రామ ఎక్స్ రోడ్డు పరిధిలోని సీతారామశాస్త్రీ నగర్ రైస్ మిల్లు ఎదురుగా ఉన్న కాలనీల్లో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, అంగన్వాడీ, ఎస్సీ భవనం, కమ్యూనిటీ హల్ నిర్మాణాలతో పాటు శ్రీశైలం జాతీయ రహదారిపై నిర్మిస్తున్న కల్వర్టు కారణంగా కాలనీలకు మురుగు నీరు రాకుండా రోడ్డుకు ఇరువైపులా సైడ్ డ్రైయిన్, నిర్మాణం చేపట్టాలని, ప్రభుత్వ కస్తూర్చా, జూనియర్ కాలజీ, పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.
అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభి వృద్ధికి నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఎంపీపీ మంద జ్యోతి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ సర్పంచ్ లుగా ఉన్న గ్రామాలకు నిధులు మంజూరు చేయాలని కోరడంతో మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీపీ తెలిపారు.
కార్యక్రమంలో ఏనుగు శ్రావణి జంగారెడ్డి, ప్రభాకర్; ఎంపీటీసీలు జ్యోతి నర్సింహరెడ్డి, వరికుప్పల బాల్రాజ్, రేఖ, మల్లేష్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తేరేటి లక్ష్మణ్ ముదిరాజ్, మండల పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ ఆనేగౌని అశోక్గౌడ్, నాయకులు గణేష్, మహేందర్, తాళ్ల బాలేష్ ముదిరాజ్,బాబురావు, మల్లేష్, మంద పాండు పాల్గొన్నారు.