శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల సోమేశ్వర స్వామీ దేవాస్థానంలో రూ. 14 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆలయ కమిటీ కార్యాలయాన్ని సోమవారం స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ చెన్నంరాజు ముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు గణేష్ ముదిరాజ్, మారబోయిన రాజుయాదవ్, ఆలయ కమిటీ భవన నిర్మాణ దాత విఠల్, ఆలయ కమిటీ ప్రతినిదులు యాదగిరి, వసంత్ కుమార్, నరేందర్ రెడ్డి, సోమేష్ తదితరులు పాల్గొన్నారు.