జూబ్లీహిల్స్ : ఆడబిడ్డల పెండ్లిళ్లు చేయలేక ఆర్థికంగా ఇబ్బందులు పడే తల్లిదండ్రుల ఆవేదనను తీర్చేందుకు ముఖ్య మంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో ప్రవేశపెట్టినవే సంక్షేమ పథకాలు అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు.
సోమవారం రహ్మత్నగర్ డివిజన్కు చెందిన 54 మంది లబ్దిదారులకు ప్రత్యేక కానుకలతో పాటు రూ.54, 06, 264 విలువైన చెక్కులను కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రూపొందించిన పథకాలు ఆయన మానస పుత్రికలని, సంక్షేమ పథకాలన్నీ మానవీయ కోణంతో ప్రవేశపెట్టినవేనని పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మన్సూర్, భాస్కర్, పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.