హిమాయత్నగర్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఆదివారం హిమాయత్నగర్ డివిజన్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ జి.మహాలక్ష్మి, మాజీ కార్పొరేటర్ జడల హేమలతాయాదవ్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలను ఎంతో సంబురంగా జరుపు కునేందుకు ప్రతి ఆడపడుచుకు చీరలను కానుకగా అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలను ఆడపడుచులు గుండెలకు హత్తు కుంటున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఏలాంటి బేధాలు లేకుండా అన్ని మతాలను సమాన దృష్టితో ఆదరించి వారి వారి పండుగలకు కానుకలను అంజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బాబుయాదవ్, యాదగిరి, నందు, ఐలమ్మ, ప్రభాకర్ గౌడ్, మహ్మద్సర్ఫరాజ్, యతిరాజ్, ఐలమ్మ, రాజేంద్ర ప్రసాద్, సయ్యద్ బిన్ ఖార్వన్, కృష్ణయాదవ్, పాల్గొన్నారు.