శేరిలింగంపల్లి : సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు ఎనలేనివని, ప్రతి ఓక్కరూ సీసీటీవీల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు.
శనివారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మంజీరా డైమండ్ హైట్స్ కాలనీలో రూః 3 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేసిన 22 సీసీటీవీ కెమెరాలను స్ధానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడతూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు తగిన సహాయ సహాకారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఒక సీసీటీవీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ప్రతి ఒక్కరూ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్,. సబ్ఇన్స్ఫెక్టర్ అహ్మద్పాషా, మంజీరా డైమండ్ హైట్స్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.