మహేశ్వరం : మండలంలోని మన్సాన్పల్లి గ్రామ అభివృద్ధితో పాటు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులను మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసిన గ్రామ నాయకులు, గ్రామస్తులు గ్రామాభివృద్దికి కృషి చేస్తున్న మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.
మన్సాన్పల్లి చౌరస్తాను ఆధునీకరించడంతోపాటు సీసీ రోడ్డుకు 1కోటి 50లక్షలు, మన్సాన్పల్లి గ్రామ సీసీ రోడ్లకు 20 లక్షలు నిధులను మంజూరు చేసినందుకు మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ మాజీ అద్యక్షులు హనుమగల్ల చంద్రయ్య నాయకులు కంది అరుణరమేష్, మంత్రిరాజేష్, సర్పంచ్ నారాయణరెడ్డి, ఉపసర్పంచ్ బురమోని నర్సింహ్మయాదవ్, సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.