మన్సూరాబాద్ : తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపారు.
సీఎం కేసీఆర్కు గత ఏప్రిల్లో స్వల్ప లక్షణాలతో కరోనా సోకినప్పుడు ఆయన త్వరగా కోలుకుంటే పెద్ద అంబర్పేట్లోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి ఐదు బోనాలను సమర్పిస్తానని శ్రీనివాస్ గుప్త మొక్కుకున్నట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా మంగళవారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారికి ఐదు బోనాలను సమర్పించి మొక్కును తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త సతీమణి ఉప్పల స్వప్న, కుమారులు ఉప్పల సాయికిరణ్, ఉప్పల సాయితేజ తదితరులు పాల్గొన్నారు.