మహేశ్వరం : గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు మహేశ్వరం ఎక్సైజ్ సీఐ వీణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తెలిపిన వివరాల ప్రకారం ..రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య ఆదేశాల తో ఎన్ఫోర్స్మెంట్ సూపరిండెంట్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు.
ఈ తనిఖీలలో ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని వారి వద్దనుండి 3.2 కిలో గ్రాముల గంజాయి, ఒక ద్విచక్రవాహనం, ఒక సెల్పోన్ను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ సీఐ వీణారెడ్డి తెలిపారు.
నిందితులైన బనావత్ సాయికుమార్, గంట పవన్కుమార్లతో పాటు జప్తుచేసిన వస్తువులను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించి వారిని రిమాండ్కు తరలించినట్లు ఆమె తెలిపారు.