కాచిగూడ : రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ బిజీ ప్రసాద్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తి (50) యాకత్పుర-ఉప్పుగూడ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాడుతుండగా రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుని ఒంటిపై క్రీంరంగు జర్కీన్, నలుపురంగు ప్యాంటు ఉన్నట్లు, మృతుని వివరాలు తెలిసిన వారు 9949326625లో సంప్రదించాలని పోలీసులు కోరారు. కాచిగూడ రైల్వేపోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరో సంఘటనలో….
గుంటూరు డెమో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం, బీజావరం గ్రామానికి ఇ.రామన్గౌడ్ (51) కూలీ పనులు చేస్తుంటాడు.
శనివారం రాత్రి బుద్వేల్ యార్డు సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా గుంటూరు డెమో రైలు ఢీకొని రామన్గౌడ్ అక్కడికక్కడే మృతిచెందాడు.సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసును కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.