కాచిగూడ : సీఎం కేసీఆర్ పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ది పథకాలే హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తెలంగాణ ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ హూజూరాబాద్లోని నాయ కులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మెజారీతో గెలిపించి, సీఎంకు బహుమతిగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కార్యకర్తలు ప్రధాన భూమిక పోషించాలని ఆయన సూచించారు. నిత్యం ప్రజా సంక్షేమం కోసం పాటుపడే టీఆర్ఎస్ పార్టీని గెలిపించి, హూజూ రాబాద్ అభివృద్దికి సహకరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హూజూరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలంటే గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు.
ప్రజల ఆధరణ చూస్తుంటే ఎమ్మెల్సీ ఎన్నికల పలితాలే ఈ హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో పునరావృతం అవుతాయని, దీనికితోడు బీసీ, బీసీ కుల, విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాద వ్ అత్యధిక మెజారిటితో గెలుపొందడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలను చిత్తుగా ఓడించి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి, బీసీల సంఘటిత శక్తిని నిరుపించాలని ఆయన పిలుపునిచ్చారు.