అమీర్పేట్ : సనత్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని ఇంటింటికీ చేర్చడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా అమీర్పేట్, బేగంపేట్, రాంగోపాల్పేట్, బన్సీలాల్పేట్, మోండా డివిజన్లకు నూతన అధ్యక్షుల నియామకం జరిగింది.
అమీర్పేట్ డివిజన్ అధ్యక్షులుగా హనుమంతరావు, ప్రధాన కార్యదర్శిగా మణి సంతోష్కుమార్, బేగంపేట్ డివిజన్ అధ్యక్షులుగా శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శులుగా ఆరీఫ్, సందీప్, రాంగోపాల్పేట్ డివిజన్ అధ్యక్షులుగా అత్తెల్లి శ్రీనివాసగౌడ్, ప్రధాన కార్యదర్శులుగా ఆంజనేయులు, గణేష్, మోండామార్కెట్ డివిజన్ అధ్యక్షులుగా ఆకుల హరిక్రిష్ణ, బన్సీలాల్పేట్ డివిజన్ అధ్యక్షులుగా వెంకటేశన్, ప్రధానకార్యదర్శులుగా రాజేందర్, మహేందర్లు నియమితులయ్యారు.
ఈ మేరకు నూతన అధ్యక్ష, కార్యదర్శులు సోమవారం ఉదయం మంత్రి తలసానిని ఆయన నివాసంలో కలుసుకుని తమకు డివిజన్ బాధ్యతలు అప్పగించడం పట్ల ధన్యవాదాలు తెలుపుతూ సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ల కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.