కందుకూరు : మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని పలువురు టీఆర్ ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఏషియన్ పెయింట్స్ పరిశ్రమలో జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు. తీగల విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించారు.
అందులో భాగంగా ఆదివారం మండల ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు మూల హన్మంత్రెడ్డి, లయన్స్ క్లబ్ జిల్లా పీఆర్ఓ డాక్టరు పీ మహేంద్రకుమార్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు కొలను విజ్ఞేశ్వర్రెడ్డి, అమరేందర్రెడ్డిలు ఆదివారం టీకేఆర్ కళశాలకు వెళ్లి శాలువాలు, పూలదండలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులకు అండగా ఉంటానని తెలిపారు. తన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.