బంజారాహిల్స్ : దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన భగత్సింగ్ స్పూర్తిని నేటి తరం యువత అందిపుచ్చుకోవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సర్ధార్ భగత్సింగ్ జయంతి సందర్భంగా మంగళవారం జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్లోని భగత్సింగ్ కాలనీ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.
దేశస్వాతంత్య్రం కోసం భగత్ సింగ్ చేసిన పోరాటాలను కొనియాడారు. నేటి యువతరం భగత్సింగ్ను స్పూర్తిగా తీసుకోవాలని, సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు వెంకటస్వామి, నగేష్ సాగర్, మామిడి నర్సింగరావు, రాజన్న, అబ్దుల్ ఘని, శేఖర్, మహిళా విభాగం నేతలు దీపాదేవి, పద్మ, హనుమమ్మ , దయ్యాలదాసు, రాము తదితరులు పాల్గొన్నారు.