మియాపూర్ : టీఆర్ఎస్ అనుబంధ కమిటీల బాధ్యులు పార్టీబలోపేతానికి కృషిచేయాలని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం నూతనంగా ఏర్పాటైన వివేకానందనగర్ డివిజన్ పార్టీ, ప్రధాన, అనుబంధ, బస్తీకమిటీల ప్రమాణస్వీకారకార్యక్రమం అశోకగార్డెన్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, కార్పొరేటర్లు రోజాదేవిరంగారావు, దొడ్ల వెంకటేశ్గౌడ్, నార్నే శ్రీనివాస రావుతో కలిసి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలులో టీఆర్ఎస్ శ్రేణులు నిరంతరం పాటుపడాలన్నారు. సబ్బండవర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నదని తెలిపారు. పార్టీని నమ్మిన ప్రతికార్యకర్తకు సముచితస్ధానమిచ్చి గౌరవిస్తామన్నారు.
నూతనంగా ఎన్నికైన బాధ్యులు పార్టీనియమ నిబంధనలకు లోబడి పార్టీప్రతిష్టను మరింత ఇనుమడింపజేయాలన్నారు. కార్యక్రమంలో మాజీకార్పొరేటర్ రంగారావు, గొట్టిముక్కుల పెద్దబాస్కర్, నాయినేని చంద్రకాంత్రావు, కార్తీక్రావు, మోజేష్, భద్రయ్య, శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.