మహేశ్వరం : కులవృత్తులకు తెలంగాణ సర్కార్ పెద్దపీట వేసి ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.ఆదివారం మండల పరిధిలోని రావిర్యాల, కొత్వాల్ చెరువుతండాలలో సమీకృత మత్స్య శాఖ అభివృద్ది పథకంలో బాగంగా 5లక్షల 67వేల చేపపిల్లలను పంపిణీ చేసారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏరాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవు తున్నాయని ఆమె అన్నారు. మత్స్యకారుల అభివృద్ది కోసం మొబైల్ వాహనాలు, మోటర్ బైక్ లు అందిస్తున్నామని ఆమెతెలిపారు. తద్వారా మత్స్యకారులు సమీప పట్టణప్రాంతాలలో అమ్ముకునే అవకాశం ఉందని ఆమె అన్నారు.
చెరువుల్లో చేపలు వదలడంతో సత్పలితాలు వచ్చి నీలి విప్లవం వైపు బాటలు పడుతున్నాయని ఆమెఅన్నారు. 2016వ సంవత్సరంలో సీఎం కేసీఆర్ మహోన్నత లక్ష్యంతో ప్రారంభించిన ఉచిత చేపల పంపిణీ కార్యక్రమం నేడు ఇతర రాష్ట్రాలు హర్షించేవిధంగా ప్రయోజనాలు కలుగుతున్నాయని ఆమె అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 500 ఔట్ లెట్ల ఏర్పాటు ద్వారా తెలంగాణ బ్రాండ్ పేరుతో చేపల విక్రయాలు,చేపల వంటకాలు అందు బాటులోకి వచ్చాయని ఆమె అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా మత్స్యశాకాధికారి సుకీర్తి ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునితాఆంధ్యానాయక్ ,మండల పార్టీ అద్యక్షులు అంతోతు రాజునాయక్ ,కొత్వాల్ చెరువు తండా సర్పంచ్ మోతిలాల్ నాయక్ ,వర్కింగ్ ప్రసిడెంట్ వర్కల యాదగిరిగౌడ్ ఎంపీడీవో నర్సింలు,రైతుసమన్వయసమితి నాయకులు కూనయాదయ్య తదితరులు పాల్గొన్నారు.