చిక్కడపల్లి: గాంధీనగర్లో వివిధ బస్తీ కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.నిమజ్జన వేడుకలను వైభవంగా నిర్వహించారు. కళాకారుల ఆటాపాటాలు, యువతీ,యువకుల నృత్యాలతో ఊరేగింపు ఉత్సవంగా కొనసాగింది. గాంధీనగర్ కెనరా బ్యాంక్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన వినాయ మండపంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ వినాయకున్ని దర్శించుకున్నారు.
అనంతరం ఊరేగింపును ప్రారంభించారు. చంద్రశేఖర్, నారాయణ, లక్ష్మి, చంద్ర శేఖర్, నవనీత,కిషోర్ తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్లో జవహర్నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మండపంలో వినాయకున్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ దర్శించుకున్నారు.అనంతరం ఊరేగింపును ప్రారంభించారు.