ఖైరతాబాద్ : భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బ్యాండ్, ఎన్టీఆర్ ఘాట్, పివి మార్గ్ లో పెద్ద ఎత్తున విగ్రహాలు వచ్చి చేరాయి. ఆదివారం ప్రారంభమైన విగ్రహాల నిమజ్జన కార్యక్రమం 24 గంటలు గడుస్తున్నా ఇంకా కొనసాగుతుంది. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రెండోరోజు కూడా వివిధ ప్రాంతాలనుంచి వందలాది విగ్రహాలు ట్యాంక్బండ్కు చేరుకుంటున్నాయి. మరోవైపు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అని కోర్టు తేల్చి చెప్పడంతో చాలామంది దూర ప్రాంతాల వారు కూడా ట్యాంక్బండ్లో నిమజ్జనం చేయడానికి వస్తున్నారు. మరోవైపు కోర్టు ఆదేశాలతో సాగర్ లో వ్యర్థాల తొలగింపును జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది.
నగరంలోని ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ లో గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యింది. దాదాపు 6500లకు పైగా గణేష్ విగ్రహాలు హస్సేన్ సాగర్ లో నిమజ్జనం అయ్యాయి. నిమజ్జనం పూర్తి అయిన సందర్భంగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ మార్గ్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను సడలించారు. ఈ రోజు రాత్రి వరకు గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తికానుంది. మరోవైపు నిమజ్జన ప్రాంతంలో జీహెచ్ఎంసీ సిబ్బంది శానిటేషన్ పనులను ప్రారంభించింది. 50 వాహనాలతో వ్యర్థాల తొలగింపునకు హెచ్ ఎమ్ డీఏ ఏర్పాట్లు చేసింది.