అంబర్పేట : గ్రేటర్ హైదరాబాద్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.5177 కోట్లు నిధులు విడుదల చేయడం చరిత్రలోనే కొత్త అధ్యాయమని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధి దీనికి నిదర్శనమని చెప్పారు. శుక్రవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచినీటి వ్యవస్థ, మురుగునీటి శుద్ధి, రోడ్ల నిర్మాణానికి ఈ నిధులను వెచ్చించనున్నారని చెప్పారు.
మూసీ సుందరీకరణలో భాగంగా 37 ఏస్టీపీలను నిర్మించనుందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటైన తరువాత గతంలో ఏ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయలేదని పేర్కొన్నారు. చరిత్రలో తొలిసారి భారీ స్థాయి నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్కు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.