బడంగ్పేట : ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివనారాయణ పురంలో నివాసం ఉండే బండి సాయిరాజ్ (42) ఇంట్లో ఎవరు లేని సమయంలో నాలుగు రోజుల క్రితం చున్నితో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎఎస్ఐ తిరుపతి తెలిపారు. సాయి రాజ్ ఇంటి దగ్గర దుర్వాసన రావడంతో మీర్పేటలో ఉన్న సాయి రాజ్ సోదరుడు జయరాజ్కు స్థానికులు పోన్ చేశారు. ఆయన వచ్చి చూసే సరికి అప్పటికే మృతి చెందడంతో పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సాయి రాజ్కు భార్య భబిత ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సాయి రాజ్ కోఠిలోని తూర్పుబజార్లో పనిచేస్తారని పోలీసులు తెలిపారు. ఇటీవల భబిత, ఇద్దరు పిలల్లతో పీఎన్టీ కాలనీలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది.ఈనెల 10న తిరిగి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న బంగారం కనిపించకపోవడంతో భర్తను అడిగింది. దీంతో సాయిరాజ్ బంగారాన్ని తాకట్టు పెట్టిన్నట్లు చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. కాగా అదే కోపంతో భబిత 11 న తల్లిగారి ఇంటికి పోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు.