రవీంద్రభారతి : బతుకమ్మ సంబురాలు 2021లో భాగంగా భాషాసాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వ సౌజన్యంతో సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించిన 30 రోజుల కిడ్స్ డ్రామా ఆన్లైన్ శిక్షణా-2 కార్యక్రమంలో పిల్లలు తమ నటన చాతుర్యాన్ని అద్బుతంగా ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బాషా సంచాలకులు మామిడి హరికృష్ణ విచ్చేసి మాట్లాడుతూ ఈ శిక్షణా శిబిరం నటనేకాదు పిల్లల సృజనాత్మకతని, స్వయం శక్తిని పెంపొందిస్తుందని అన్నారు.మాధ్యమ వ్యాయోగం నాటకాన్ని సంస్కృతంలో దశరూపకం అంటారన్నారు.
ఈ నాటకం ప్రతిష్టాత్మకమైన జాతీయవేదిక రవీంద్రభారతిలో ప్రదర్శించటం అది పిల్లలచే ప్రదర్శించటం అందరికీ అనందంగా ఉందని తెలిపారు. ఈ శిక్షణా శిభిరంలో 24 మంది పిల్లలు పాల్గొనగా అందరు 30 రోజులు ఆన్లైన్లో శిక్షణ పొంది గత 6 రోజులు వేదికపై రిహార్సల్ చేసి ఇంత అద్బుతంగా ప్రదర్శించడం సంతోషకరమని పిల్లల తెలిపారు.
నాటకాన్ని సంస్కృతంలో ప్రదర్శించడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ థియేటర్ మీడియా రిపర్టరీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్గౌడ్ను మామిడి హరికృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో అక్షిత, ప్రణీత, శిరీష్, చతురు తదితరులు పాల్గొన్నారు.