కందుకూరు: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి,నిధి చట్టాన్ని పగడ్భందీగా అమలు చేయాలని కోరుతూ దళిత బహుజన శ్రామిక యునియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండునర్సింహ ఆధ్వర్యంలో బుధవారం మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఆయన వెంట జడ్పీటీసీ సభ్యుడు బొక్కజంగారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు చిర సాయిలు ఉన్నారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని చెప్పారు. అన్ని కులాలను సమాన ప్రాధాన్యతను ఇస్తున్నట్లు వివరించారు. దళితబంధు పథకం దళితులకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు నిధులను కేటాయిస్తూ అభివృద్ది చేస్తున్నట్లు వివరించారు. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ వాడల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు చెప్పారు.
ఎస్సీ, ఎస్టీలకు కావాల్సిన అభివృద్ధి పనులను సర్వే చేస్తున్నారని ఆ సర్వే ఆధారంగా వసతులను కల్పిస్తామని వివరించారు. దళిత బహుజన శ్రామిక యూనియన్ తెలిపిన సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకవెళ్లి త్వరలో అమలయ్యే విధంగా చూస్తానని వారికి హమీ ఇచ్చారు. కార్యక్రమంలో మాదాపూరు సర్పంచ్ మంద సాయిలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.