శంషాబాద్ రూరల్ : పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని పలువురు బాధిత కుటుంబ సభ్యులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యమందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రీలిఫ్ ఫండ్ చెక్కులు ఇస్తు ఎంతో మందిపేదల ప్రాణాలను కాపాడుతున్నట్లు చెప్పారు.
శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ గ్రామానికి చెందిన (ఉదయ్కుమార్-6000…బాలమణి 23,500), బహదూర్ గూడ గ్రామానికి చెందిన (నర్సింహ 46,000..సత్యం 46,000… రవీందర్ 10,500),చిన్నగోల్కొండ గ్రామానికి చెందిన (నాగేష్-60,000), పిల్లోనిగూడ గ్రామానికి చెందిన (స్వరూప 60,000), శంకరాపూర్ గ్రామానికి చెందిన (లక్ష్మమ్మ32,000) చెక్కులు అందచేశారు.
అలాగే జూకల్ గ్రామానికి చెందిన పూజిత 16,000, శ్రీనివాస్ 48,000) హమిదుల్లానగర్ గ్రామానికి చెందిన (ఎం నర్సింహ 32,000, బాలమణి 59,000), నానాజీపూర్ గ్రామానికి చెందిన వై సబితా 56,000. మొత్తం 5,43,000 విలువైన చెక్కులను పంపిణీ చేసినట్టు తెలిపారు.
కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు నీరటి రాజుముదిరాజ్, మాజీ సర్పంచ్ సత్యనారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి మంచర్ల మోహన్రావు, పీఏసీఎస్ చైర్మన్ దౌవణాకర్గౌడ్,కొ-అప్షన్ సభ్యుడు గౌస్పాషా, సర్పంచ్లు సతీష్యాదవ్, కోడురి నర్సమ్మ,మహేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.