కందుకూరు : క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని దెబ్బడగూడ గ్రామానికి చెందిన వనం ఆరాధ్య జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొని కాంస్య పథకాన్ని సాధించారు. దీంతో బుధవారం ఆరాధ్య మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు అన్నిరకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.
క్రీడలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంతో మంది క్రీడకారులు మరుగున పడ్డారని చెప్పారు. వారందరిని వెలుగులోకి తీసుకరావాల్సి ఉందన్నారు. బాలికల ఆత్మరక్షణ కోసం బాక్సింగ్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరాధ్య కాంస్య పథకాన్ని సాధించిండం సంతోషకరమని తెలిపారు. కార్యక్రమంలో పలువులు గ్రామస్తులు పాల్గొన్నారు.