కందుకూరు : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తప్ప ప్రతి పక్షాలకు చోటులేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సాయిరెడ్డిగూడకు చెందిన పలు పార్టీల నాయకులు సోమవారం టీఅర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి టీఅర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు.
అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతి పక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. దళిత బంధు, రైతు బంధు, వృద్ధాప్య, పింఛన్లు, ఉచిత కరెంట్, తాగునీరు ఇచ్చినందుకా వివర్శిస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని సూచించారు.
కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు సురుసాని సురేందర్రెడ్డి గూడూరు భాస్కర్, మహిళావిభాగం అధ్యక్షురాలు దాసర్లపల్లి ఎంపీటీసీ తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, సదానంద్గౌడ్, బొర రాము లు, గోవర్ధన్, బాలరాజు, శేఖర్, వెంకటయ్య, రమేశ్, రాంచంద్రం, యాదయ్య,పాపయ్య, రాములు పాల్గొన్నారు.