ఆర్కేపురం : సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరంలామారిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్నగర్కు చెందిన సంతోషి అనే మహిళ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవడంతో స్థానిక టీఆర్ఎస్ నాయకులను ఆశ్రయించింది.
ఈ విషయాన్ని మంత్రి సబితాఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లి సహాయనిధి నుంచి నిమ్స్ హాస్పిటల్కు రూ.2లక్షల ఎల్ఓసి లేటర్ను బాధితురాలికి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లక్షలు వెచ్చించి వైద్యం చేయించు కోలేని నిరుపేద ప్రజలకు సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
పేద ప్రజల సంక్షేమ, అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలందరూ సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్, నాయకులు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ సాజీద్, మురళీధర్రెడ్డి తదితరులు ఉన్నారు.