వేంసూరు, మే 17 : పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రైతువేదికలో మంగళవారం కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. రైతువేదికలు రైతుల అభివృద్ధికి జ్ఞానకేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు. రైతువేదికలో వ్యవసాయ కరదీపికలను అందించారు. ప్రతి రైతు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ పద్దతులను అవలంభించేలా వంద రకాల పుస్తకాలను రైతువేదికలో గ్రంథాలయంగా ఏర్పాటు చేస్తామన్నారు.
రైతులు పంట మార్పిడి పద్దతిని అలవర్చుకోవాలని, రసాయనిక ఎరువులు మోతాదుకు మించి వాడవద్దని సూచించారు. నకిలీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులను రైతులు గుర్తిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వెల్ది జగన్మోహన్రావు, సర్పంచ్లు ఎండీ. ఫైజుద్దీన్, బూరుగు నాగేశ్వరరావు, మేడా రమేశ్, వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ నాయుడు వెంకటేశ్వరరావు, వ్యవసాయాధికారి పీ.రామ్మోహన్, ఎంపీడీవో వీరేశం, ఏఈవోలు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పాలా వెంకటరెడ్డి, కంటె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.