వనస్థలిపురం : నాణ్యమైన, ఆధునిక వైద్య సేవల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. వనస్థలిపురం ప్రశాంత్నగర్లో ఏర్పాటు చేసిన పెర్సీ పాలిక్లీనిక్ను ఆయన గురువారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వైద్యం కోసం హైదరాబాద్కు ఎంతోమంది వస్తున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వైద్య విధానం కారణంగా నాణ్యమైన వైద్యం అందుతోందన్నారు. ఆరోగ్యం పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి, చింతల రవికుమార్, ఈశ్వరమ్మ యాదవ్, ఆనంద్, వైద్యులు డాక్టర్ హిత, అభిలాష్, శిరీష, యజ్ఞ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.