శంషాబాద్ రూరల్ : అనుమానస్పదస్థితిలో వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం శంషాబాద్ మండలంలోని తొండుపల్లి వద్ద జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహింపట్నం మండలం పోచారం గ్రామానికి చెందిన బద్రప్ప(67) మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి వరకు ఇంటికి వెళ్లలేదు.
బుధవారం ఉదయం శంషాబాద్ మండలంలోని తొండుపల్లి వద్ద రైల్వే విద్యుత్స్తంభానికి ఉరివేసుకొని ఉన్నట్లు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టు పక్కల పోలీసులకు సమాచారం ఇవ్వగా పోచారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు పోస్టుమార్ఠం నిమిత్తం నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.