తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ ప్రభుత్వ న్యూ ఢిల్లీ సలహాదారు శ్రీరామచంద్రుడు తేజావత్ తన 68వ జన్మదినం సందర్బంగా ఎంఎన్జే క్యాన్సర్ దవఖాన ప్రాంగణంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు సంతోష్కుమార్ పిలుపునకు స్పందించి గురువారం మొక్కలు నాటడంతో పాటు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
అనంతరం పలువురు రోగులకు వారి సహయకులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్రుడు తేజావత్ నాయక్తో పాటు ఆయన సతీమణి భాగ్యలక్ష్మి, ఆర్టీ కమిషనర్ డాక్టర్ శంకర్నాయక్, దవఖాన డైరక్టర్ డాక్టర్ జయలత, వైద్యులు రాజ్కుమార్ జాదవ్, రామ్నాయక్, చంద్రారావు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.