శంషాబాద్ : శ్రావణ మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని శ్రీ రామనగరం లో ఉన్న దివ్యసాకేత క్షేత్రంలో వైభవంంగా శ్రీ లక్ష్మి నారాయణ కళ్యాణోత్సవం నిర్వహించారు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ చినజీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో శ్రీ లక్ష్మి నారాయణ కళ్యాణోత్సవం, నక్షత్రేష్టి ప్రయుక్త శ్రీ యాగ పూర్ణాహుతి, ధన్వంతరి హోమం జరిపారు. వేదపండితులు శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్ఛారణలతో క్రతువు నిర్వహించారు.