బేగంపేట్ : రాంగోపాల్పేట్ డివిజన్ మహాత్మాగాంధీ రోడ్డులోని గాంధీ విగ్రహాం పరిసరాలను అత్యంత సుందరంగ తీర్చి దిద్దునున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. గురువారం గాంధీ విగ్రహాం పరిసరాలను మంత్రి తలసాని మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్తో కలిసి పరిశీలించారు.
ఈ సంధర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న గాంధీ విగ్రహాం పక్కనే నూతనంగా మరో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అదే విధంగా అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను మరో చోటుకు తరలించాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం ఉన్న స్థలానికి అధనంగా పక్కనే ఉన్న స్థలాన్ని కూడా వినియోగంలోకి తీసుకొని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు వివరించారు. గాంధీ విగ్రహాం పరిసరాల అభివృద్ధికి రూపొందించిన నమునాను జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మంత్రికి చూపించి వివరించారు.
ఈ కార్యక్రమంలో బేగంపేట్ సర్కిల్ ఉప కమిషనర్ ముకుందరెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిష్టఫర్ జలమండలి జీఎం రమణారెడ్డి, మాజీ కార్పొరేటర్లు అరుణగౌడ్, కోషికె కిరణ్మయికిషోర్ తదితరులు పాల్గొన్నారు.