ముషీరాబాద్ : నియోజకవర్గంలోని బస్తీల్లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా కొత్త పైపులైన్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. సోమవారం ఆయన జలమండలి అధికారులతో కలిసి ముషీరాబాద్ డివిజన్లోని హజార్గల్లీ, సెయింట్ పాయిస్ చర్చి గల్లీ, గణేశ్నగర్లో పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానికులు కలుషిత నీరు, డ్రైనేజీ లీకేజీతో ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యాభై ఏండ్ల క్రితం ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైపులైన్లు శిథిలావస్థకు చేరుకోవడంతోనే బస్తీల్లో లీకేజీ సమస్య అధికమవుతున్నదన్నారు. దశలవారీగా మురుగునీటి లీకేజీ సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు.
ఫోన్ వచ్చిందంటే డ్రైనేజీకి సంబంధించి ఫిర్యాదే అన్నట్లుగా పరిస్థితి ఉందని, దీన్ని అదిగమించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కలుషిత నీటి సమస్యలు అధికమవుతున్న నేపథ్యంలో శిథిలమైన మంచినీటి, డ్రైనేజీ పైపులైన్లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన కొత్త పైపులైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
డ్రైనేజీ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. స్సేన్ సాగర్, నాగమయ్యకుంట నాలాలకు ఇరువైపులా ప్రహరీల నిర్మాణం చేపట్టనున్నట్లు, ఇందుకోసం నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. నాగమయ్యకుంట, పద్మకాలనీ హెరిటేజ్ బిల్డింగ్ వద్ద నాలాను విస్తరించి బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామన్నారు.
కార్యక్రమంలో జలమండలి డీజీఎం వాహబ్, మేనేజర్ కృష్ణమోహన్, టీఆర్ఎస్ నాయకులు కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, వి.సుధాకర్గుప్తా, శ్రీధర్రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, గోవింద్, మోజస్, మహ్మద్ ఖదీర్, బి.శ్రీనివాస్రెడ్డి, దీన్దయాళ్రెడ్డి, శివముదిరాజ్, నరేశ్రెడ్డి, శోభ, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.